హోటళ్ళు 3.2 మిలియన్ల బహెరిన్ దినార్ల ఆదాయాన్ని గడించాయి
- June 29, 2017
మనామా: కింగ్డమ్ లో హోటల్స్ ఈద్ అల్ ఫితర సమయంలో 3.2 మిలియన్ల బహెరిన్ దినార్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఫైవ్ స్టార్స్ హోటళ్లలో 22,000 హోటల్ గదులు బుక్ కాబడ్డాయి. అదేవిధంగా అక్కడ మొత్తం మీద 80 శాతం వరకు యాత్రికులు బస చేసినట్లు ఒక సమాచారం. ఈ గణాంకాలతో పర్యాటక పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి సానుకూల ఫలితాలు ప్రతిబింబించాయి.రాజ్యంలో ఈద్ అల్ ఫిత్ర్ సెలవుల సమయంలో బుకింగ్స్ లతో కిక్కిరిసిపోయ ఉన్నాయి, పండుగ సీజన్లో ప్రయాణికులను ఆహ్వానించడానికి ఎదురుచూస్తున్నాయి అని బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ ఖలీద్ బిన్ హుమద్ అల్ ఖలీఫా అన్నారు. మా ముందున్న ఏకైక లక్ష్యం ఏమిటంటే,సెలవుదినాలలో ప్రముఖ ఆతిధ్య ప్రదేశంగా కింగ్డమ్ ను తీర్చిదిద్దడం, ఉత్సవ సీజన్లలో పలు కార్యక్రమాలు నిర్వహించడమే మా విధిగా పెటుకొన్నట్లు ఆయన తెలిపారు. ఈద్ అల్ ఫిత్ర్ సెలవులు కూడా 'స్టాక్' ప్రారంభానికి సాక్ష్యమిస్తాయి - మిడిల్ ఈస్ట్ లో మొదటిసారి నిర్వహించిన ఒక కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. జూలై 4-8 నుండి బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో లెగో సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









