గంగూలి తో చిందేసిన శ్రీదేవి
- July 01, 2017
అతిలోకసుందరి శ్రీదేవి తన 300వ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన శ్రీదేవి, త్వరలో రిలీజ్ అవుతున్న మామ్ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది. తన 300వ సినిమా కావటం, భర్త బోనీ కపూర్ స్వయంగా నిర్మిస్తుండటంతో మామ్ ను ఎలాగైన సక్సెస్ చేయాలని భావిస్తుంది. అందుకే బాలీవుడ్ తో పాటు అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రమోషన్ లోభాగంగా మాజీ క్రికెటర్ గంగూలి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న దాదాగిరి షోలో పాల్గొంది శ్రీదేవి. ఓ బెంగాల్ చానల్ లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమంలో సినీ తారలు పాల్గొనటం ఇదే తొలిసారి. శ్రీదేవి లాంటి టాప్ స్టార్ తొలిసారిగా హాజరవుతుండటంతో షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో సెక్యూరిటీ పెంచారట, అంతేకాదు కేవలం చిన్నారుల మధ్యే ఈ స్పెషల్ ఎపిసోడ్ ను షూట్ చేశారు. త్వరలో ప్రసారం కానున్న ఈ షో కోసం శ్రీదేవి తో కలిసి గంగూలి డ్యాన్స్ కూడా చేశాడు.
ఈ కార్యక్రమంలో శ్రీదేవితో పాటు ఆమె భర్త, నిర్మాత బోని కపూర్, దర్శకుడు రవి వడయార్ ను కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మామ్ ఘనవిజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్.
తాజా వార్తలు
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త







