పాక్ జైళ్లల్లో మగ్గుతున్న 546 మంది భారత ఖైదీలకు విముక్తి
- July 01, 2017
పాకిస్తాన్ జైళ్లల్లో మగ్గుతున్న 546 మంది భారతీయులకు త్వరలో విముక్తి లభించనుంది. పాక్ లో ఎన్నో ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న వీరిని భారత్కు పంపివేసినట్లు పాక్ ప్రభుత్వం శనివారం ఓ జాబితా విడుదల చేసింది. 2008 మే21న చేసుకున్న ఒప్పందం ప్రకారం తమ దేశంలో శిక్ష అనుభవిస్తున్న భారతీయులను విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం హైకమిషనర్ గౌతమ్ బాంబవాలేకు ఖైదీల జాబితా అందజేసింది.
విడుదలకానున్న 546 మంది భారతీయులలో 52 మంది సామాన్య ప్రజానికం ఉండగా, 494 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. ప్రతి ఏడాది జనవరి 1న, జులై 1న ఇలా రెండు పర్యాయాలు పరస్పరం ఖైదీలను వారి దేశాలకు పంపివేసేందుకు గాను వారి జాబితా విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. భారత్ విడుదల చేయనున్న తమ దేశ ఖైదీల జాబితా కోసం ఎదురుచూస్తున్నట్లు ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







