పాక్ జైళ్లల్లో మగ్గుతున్న 546 మంది భారత ఖైదీలకు విముక్తి
- July 01, 2017
పాకిస్తాన్ జైళ్లల్లో మగ్గుతున్న 546 మంది భారతీయులకు త్వరలో విముక్తి లభించనుంది. పాక్ లో ఎన్నో ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న వీరిని భారత్కు పంపివేసినట్లు పాక్ ప్రభుత్వం శనివారం ఓ జాబితా విడుదల చేసింది. 2008 మే21న చేసుకున్న ఒప్పందం ప్రకారం తమ దేశంలో శిక్ష అనుభవిస్తున్న భారతీయులను విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం హైకమిషనర్ గౌతమ్ బాంబవాలేకు ఖైదీల జాబితా అందజేసింది.
విడుదలకానున్న 546 మంది భారతీయులలో 52 మంది సామాన్య ప్రజానికం ఉండగా, 494 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. ప్రతి ఏడాది జనవరి 1న, జులై 1న ఇలా రెండు పర్యాయాలు పరస్పరం ఖైదీలను వారి దేశాలకు పంపివేసేందుకు గాను వారి జాబితా విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. భారత్ విడుదల చేయనున్న తమ దేశ ఖైదీల జాబితా కోసం ఎదురుచూస్తున్నట్లు ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









