గంగూలి తో చిందేసిన శ్రీదేవి
- July 01, 2017
అతిలోకసుందరి శ్రీదేవి తన 300వ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన శ్రీదేవి, త్వరలో రిలీజ్ అవుతున్న మామ్ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది. తన 300వ సినిమా కావటం, భర్త బోనీ కపూర్ స్వయంగా నిర్మిస్తుండటంతో మామ్ ను ఎలాగైన సక్సెస్ చేయాలని భావిస్తుంది. అందుకే బాలీవుడ్ తో పాటు అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రమోషన్ లోభాగంగా మాజీ క్రికెటర్ గంగూలి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న దాదాగిరి షోలో పాల్గొంది శ్రీదేవి. ఓ బెంగాల్ చానల్ లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమంలో సినీ తారలు పాల్గొనటం ఇదే తొలిసారి. శ్రీదేవి లాంటి టాప్ స్టార్ తొలిసారిగా హాజరవుతుండటంతో షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో సెక్యూరిటీ పెంచారట, అంతేకాదు కేవలం చిన్నారుల మధ్యే ఈ స్పెషల్ ఎపిసోడ్ ను షూట్ చేశారు. త్వరలో ప్రసారం కానున్న ఈ షో కోసం శ్రీదేవి తో కలిసి గంగూలి డ్యాన్స్ కూడా చేశాడు.
ఈ కార్యక్రమంలో శ్రీదేవితో పాటు ఆమె భర్త, నిర్మాత బోని కపూర్, దర్శకుడు రవి వడయార్ ను కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మామ్ ఘనవిజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







