అబుదాబి రెసిడెంట్ విశాలకోసం ఆన్లైన్ లో దరఖాస్తులు
- July 01, 2017
అబుదాబి: ఎమిరేట్లో ఉన్న అబుదాబి నివాసితులు కొత్త వీసాను పొందడం లేదా వీసా పునరుద్ధరణలకు కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని శనివారం ఇంటీరియర్ మంత్రిత్వశాఖ రెసిడెన్సీ,విదేశీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపింది.https: //echannels.moi.gov.ae సందర్శించడం ద్వారా నివాసితులు ఇకపై సులువుగా వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.పోర్టల్ దరఖాస్తు మరియు పునరుద్ధరణ ప్రక్రియ భారాన్ని తగ్గించడానికి మరియు ప్రధాన కార్యాలయం చుట్టూ తిరగడం లేదా టైపింగ్ కేంద్రాలను పదే పదే సందర్శించే పరిస్థితుల నుండి నివాసితుల ఇబ్బందుల నుండి గట్టెక్కిస్తుందని డైరెక్టర్ డైరెక్టరేట్ వద్ద రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ యొక్క జనరల్ బ్రిగేడియర్ మన్సూర్ ఆల్ దహేరి తెలిపారు ఆన్లైన్ దరఖాస్తును ఈ పోర్టల్ లో సమర్పించడానికి, నివాసితులు ఇందుకోసం వివిధ దశలలో అవసరమైన పత్రాలను స్కాన్ చేయించాల్సి ఉంది. దరఖాస్తు ఆమోదించబడిన తరువాత మరియు అన్ని దశలను పూర్తి చేసిన తర్వాత, వారి పాస్పోర్ట్ లపై స్టాంప్ ముద్రించుకొన్న తర్వాత కేవలం వీసాను పొందేందుకు ప్రధాన కార్యాలయాన్ని ఒకసారి వారు సందర్శించాల్సిన అవసరం ఉంది. డైరెక్టరేట్ యొక్క టైపింగ్ కేంద్రాలు మరియు ప్రధాన కార్యాలయాలు సేవలు అందించడానికి ఎప్పటి మాదిరిగానే యధావిధంగానే కొనసాగుతాయని బ్రిడ్జియెర్ అల్ దహేరి చెప్పారు. ఆన్లైన్ పోర్టల్ లో వీసాలు కోసం లావాదేవీలను అత్యధికులు జరపడం ద్వారా ఆ విధాన ప్రక్రియ సులువుగా చేసే లక్ష్యంతో ఏర్పాటైంది. వీసాలను ఆన్లైన్ లో నమోదు చేసుకున్న వారు రిజిస్టర్డ్ టైపింగ్ కేంద్రాల వద్ద ఆ జాబితాను www.adnrd.gov.ae లో చూడవచ్చు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









