ఆధార్ కు ఇంటి నెంబర్ లింక్
- July 01, 2017
నగర పంచాయతీల్లో చోటు చేసుకుంటున్న పలు రకాల అక్రమాలకు తెర పడనుంది. ఒకరి ఇంటిని యజమానికి తెలియకుండానే ఇతరులు అక్రమంగా తమ పేరుకు మార్చుకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే ఆస్తి పన్నులు చెల్లించినా చెల్లించలేదంటూ మళ్లీ రావడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితుల్లో వినూత్న పథకానికి రూపకల్పన చేశారు. ఇక నుంచి ఏ మార్పులు చేర్పులు జరిగినా ఎప్పటికప్పుడు సదరు ఇంటి యజమానికే సమాచారం వెళ్తుంది.
అందుకోసం యజమానుల ఇంటి నంబర్కు ఆధార్ కార్డు, సెల్ఫోన్ నంబర్లను నగర పంచాయతీకి చెందిన వెబ్సైట్లో అనుసంధానం చేయాలని రాష్ట్ర కమిషనర్ ఆఫ్ మునిసిపల్ అడ్మిస్ట్రేషన్ వారు సంకల్పించారు. ఇటీవల హైదారాబాద్లో జరిగిన మున్సిపల్ అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియను జూలై 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
నర్సంపేట, పరకాలలో 17943 గృహాలు నర్సంపేట నగర పంచాయతీ పరిధిలో 10,100 గృహాలు, పరకాల నగర పంచాయతీలో 7,843 గృహాలు ఉన్నాయి. నర్సంపేట పరిధిలో ఇప్పటి వరకు 3,200, పరకాల పరిధిలో 1,050 గృహాలకు ఆధార్ లింక్ చేశారు. వాటి ఆధారంగా సిబ్బంది ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే మిగతా వారి ఇళ్లకు సంబంధించి నగర పంచాయతీ కార్యాలయాల్లో వివరాలు నమోదై ఉన్నా ఆధార్ కార్డు, సెల్ నంబర్లు అందుబాటులో లేవు.
ఉపయోగాలు
ఇంటి నంబర్కు యజమాని ఆధార్ కార్డు, సెల్ఫోన్ నంబర్ను అనుసంధానం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇటీవల కొంత మంది సదరు ఇంటి యజమానికి సమాచారం లేకుండానే ఓనర్షిప్ సర్టిఫికెట్ పొందుతున్నారు. అలాగే ఇంటి పన్ను ఎంత.. ఎంత చెల్లించాలో సిబ్బంది చెబితేనే తెలిసేది. ఇక ముందు ఆ వివరాలన్నీ మెస్సేజ్ రూపంలో యజమానికి అందుతాయి. నగర పంచాయతీ కార్యాలయాల్లో సదరు ఇంటి నంబర్ పై ఎలాంటి కదలికలు జరిగినా వెంటనే సమాచారం వస్తుంది. తప్పుడు రిజిస్ట్రేషన్లు నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఇంటి పన్నుల చెల్లింపుల్లో అక్రమాలకు చోటుండదు. ఇంటి యజమాని ప్రమేయం లేకుండా పేరు మార్పిడి జరగదు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం ఇదివరకే అయింది కాబట్టి ఫింగర్ ప్రింట్ ద్వారా బ్యాంక్లో ఉన్న డబ్బులను నేరుగా పన్నులకు చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









