యూఏఈ జలాలలో చిక్కుకుపోయిన 100 మంది భారతీయ నావికులు
- July 02, 2017
దుబాయ్: అరబ్ జలాల్లో ఉన్న 22 నౌకల్లో దాదాపు వందమంది వరకు చిక్కుకుపోయిన భారత నావికులు తమను రక్షించాల్సిందిగా దుబాయ్లోని భారత రాయబార కార్యాలయాన్నివేడకుంటున్నారు. ఈ విషయమై భారత దౌత్య అధికారి విపుల్ మాట్లాడుతూ యూఏఈ జలాల్లో చిక్కుకుపోయిన నావికుల నుంచి రక్షించమని కోరుతూ ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తెలిపారు. మొత్తం 22 నౌకల్లో 97 మంది ఉన్నట్టు పేర్కొన్నారు. వీటిలో ఉన్న విదేశీ సిబ్బంది గురించిన సమాచారం రాయబార కార్యాలయం వద్ద లేదన్నారు. అయితే అందులో శ్రీలంక, ఫిలిప్పీన్స్, మయన్మార్, పాకిస్థాన్కు చెందిన నావికులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి గత కొన్ని నెలలుగా వేతనాలు అందడం లేదని, ఆహార పదార్థాలు, తాగునీరు, ఇంధనం కూడా నిండుకున్నట్టు నావికులు చెబుతున్నట్టు విపుల్ తెలిపారు. తమను తిరిగి స్వదేశాలకు పంపించే ఏర్పాట్లు చేయాల్సిందిగా వారు కోరుతున్నట్టు పేర్కొన్నారు. దీంతో వారి వేతనాలు చెల్లించేలా యజమానులు, ఏజెంట్లపై ఒత్తిడి తీసుకురానున్నట్టు రాయబార కార్యాలయం తెలిపింది. మిషన్లో భాగంగా ఇప్పటి వరకు ఎంవీ గల్ఫ్ పెరల్, ఎంవీ ఆయా, ఎంజాజ్ 2, ఎంవీ సలీమ్, ఎంవీ రాక్, అల్ హమద్1 నౌకల్లో చిక్కుకుపోయిన 36 మందిని రక్షించి సొంత దేశాలకు పంపారు. కొందరికి నీళ్లు, ఆహారం, ఇంధనం సమకూర్చడంతోపాటు వారి మొబైల్ ఫోన్లను రీచార్జ్ కూడా చేసినట్టు విపుల్ తెలిపారు. త్వరలోనే మిగతా వారిని కూడా రక్షించి స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తామన్నారు.
తాజా వార్తలు
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!









