మహిళపై నాలుగో సారి యాసిడ్ దాడి
- July 02, 2017
ఉత్తర్ప్రదేశ్ రాజధాని లఖ్నవూలోదారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల క్రితం అత్యాచారానికి గురై కుమిలిపోతున్న ఓ వివాహితపై దుండగులు నాలుగో సారి యాసిడ్ దాడి చేశారు.
వివరాల్లోకెళితే.. రాయ్బరేలిలోని ఓ గ్రామానికి చెందిన 31 ఏళ్ల వివాహితకి ఇద్దరు పిల్లలు. 2008లో ఆమె తన స్వగ్రామంలో ఉన్నప్పుడు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఇద్దర్ని పోలీసులు అరస్ట్ చేశారు. ఆ తర్వాత 2011లో ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన నుంచి తేరుకోకుండానే 2013లో మరోసారి యాసిడ్ దాడి జరిగింది.
అప్పటినుంచి ఆమె అలిగంజ్లోని ఓ హాస్టల్లో ఉంటూ యాసిడ్ దాడి బాధితుల కోసం ఏర్పాటు చేసిన కేఫ్లో పనిచేస్తోంది. ఈ ఏడాది మార్చిలో బాధితురాలు రైలులో లఖ్నవూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు మహిళపై యాసిడ్ దాడి చేశారు. అప్పుడు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమెను హాస్పిటల్లో పరామర్శించి పరిహారం కూడా చెల్లించారు. యాసిడ్ దాడికి పాల్పడినవారిని అరెస్ట్ చేశారు.
తన జీవితంలో ఇన్ని దారుణ ఘటనలు చోటుచేసుకున్నా ఆత్మస్థైర్యం కోల్పోకుండా తన బతుకేదో తాను బతుకుంటే నాలుగోసారి ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో నీళ్లు పట్టుకోవడానికి ఆమె బయటికి వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు బైక్పై వచ్చి యాసిడ్ పోసి పరారయ్యారు. ఈ ఘటనలో కుడి వైపు ము ఖం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై లఖ్నవూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిందితులను వెంటనే పట్టుకుంటామని వెల్లడించారు. మరోపక్క మహిళపై గతంలో అత్యాచారం చేసిన నిందితులే ఇప్పుడు ఆమెపై యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









