దుబాయ్ లో మొట్టమొదట స్పందించే పింక్ వాహనం ప్రారంభం
- July 02, 2017
దుబాయ్: కొత్త గులాబీ రంగు మొదటి స్పందన వాహనంను అంబులెన్స్ సేవల కోసం దుబాయ్ కార్పొరేషన్ (డిసిఎఎస్) ప్రారంభించింది. నగరంలో మహిళలు, పిల్లలకు సేవలు అందిస్తామని వారికి ఈ వాహనం ద్వారా సేవలను అందించేందుకే అంకితమివ్వనున్నట్లు అత్యవసర అధికారి తెలిపారు. గులాబీ అత్యవసర వాహనం దుబాయ్ లో మొదటిది. అంబులెన్స్ సేవల కోసం దుబాయ్ కార్పొరేషన్ (డిసిఎఎస్) అందిస్తున్న ప్రస్తుత 24 సేవలలో ఇది తాజాగా పరిగణించబడుతుందని డిసిఎఎస్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖలీఫా బిన్ డార్రి చెప్పారు,మొట్టమొదటి గులాబీ ప్రతిస్పందన వాహనం సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. జనన కేసులు మరియు మహిళలు, పిల్లల ఇబ్బందులు గాయాల కేసులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటుంది. "స్పందన వాహనం ప్రధానంగా మహిళలకు లబ్ది చేకూర్చేస్తుంది అలాగే అన్ని రకాల కేసులను నిర్వహిస్తుంది. గర్భిణీ స్త్రీలకు, పింక్ కార్ల సహాయంతో వారి కేసులను వేగంగా పరిష్కరిస్తారు "అని ఆయన చెప్పారు.అంతేకాకుండా, గులాబీ వాహనం ఒక ఏడాది వయస్సు నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు మధ్య ఉన్న పిల్లల కేసులతో వ్యవహరించనుంది. మొదటి దశలో, వాహనం ఆల్ ట్విర్ మునిసిపాలిటీ సెంటర్లో ఉంచబడుతుంది ఉదయం11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు, 12 వరుసగా గంటల వరకు మొత్తం డెయిరి ప్రాంతంలో తన విధులను నిర్వర్తించనుంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









