అమెరికా న్యూజెర్సీలో మరో 'షిరిడీ'
- July 03, 2017షిరిడీలో సాయిబాబా మహా సంస్థానం మాదిరి ఆలయం అమెరికాలోని న్యూజెర్సీలోనూ ఏర్పాటు కానుంది. విజయవాడలోని స్టెల్లా కళాశాల వద్ద సాయిబాబా ఆలయంలో ప్రధానార్చకుడిగా పనిచేసిన గుంటూరు జిల్లాకు చెందిన శంకరమంచి రవిశర్మ.. ఆయన కొంతకాలం క్రితం అమెరికాకు వెళ్లారు. న్యూజెర్సీలోని సాయిబాబా ఆలయంలో పనిచేసిన రవిశర్మ అక్కడ షిరిడీలోని బాబా ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఇందుకోసం 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. షిరిడీలో ఉన్నట్టుగా ఆలయాన్ని, గోశాలను, చావడి, ద్వారకామాయి, కల్యాణ మండపం, శివాలయం, గురుకుల వేదశాలను నిర్మించడానికి రూ.100కోట్లు వ్యయమవుతుంది. దీన్ని ఒక్కో భక్తుడి నుంచి రూ.713.99ల చొప్పున (11 డాలర్లు) చొప్పున 1,111,111మంది భక్తుల ఇళ్లలో సాయిబాబా పాదుకలతో పూజ నిర్వహించి అవసరమైన విరాళాన్ని సేకరించారు. విజయదశమి రోజున భూమి పూజ చేయాలని నిర్ణయించామని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?