2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- January 22, 2026
దోహా: ఖతార్ 2025లో 54.3 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. ఇది 2024తో పోలిస్తే 3% ఎక్కువ అని ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA) ప్రకటించింది. ఆగస్టు నెలలో 5 మిలియన్ల ప్రయాణికులతో అత్యధిక నెలవారీ ట్రాఫిక్ నమోదైంది. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్ మరియు సంస్కృతిలో ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారా ఖతార్ సందర్శకులను ఆకర్షించిందని తెలిపింది.
వెబ్ సమ్మిట్ ఖతార్, దోహా ఫోరం 11వ సెషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్టేట్స్ పార్టీస్ టు UNCAC వంటి ఉన్నత స్థాయి సమావేశాలతోపాటు FIFA అరబ్ కప్, FIFA ఇంటర్ కాంటినెంటల్ కప్, U-17 వరల్డ్ కప్ మరియు ఫార్ములా 1 ఖతార్ ఎయిర్వేస్ గ్రాండ్ ప్రిక్స్, ఖతార్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్, దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్, లుసైల్ స్కై ఫెస్టివల్ మరియు ఖతార్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ వంటి ప్రయాణ డిమాండ్ను పెంచడానికి సహాయపడిందని వెల్లడించింది. వీటితోపాటు ఖతార్ సహజ ప్రకృతి సంపద, బీచ్లు మరియు మడ అడవులు ఆకర్షణను మరింత విస్తృతం చేశాయని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









