సినిమా ప్రియులకు షాక్ ఇవ్వనున్న ఏపీ.. టికెట్స్ ధర పెంపు
- July 06, 2017
వినోదం కోసం సినిమాలకు వెళ్దాం అంటే టికెట్ ధరలు షాక్ కొట్టేటట్లు వున్నాయి.. ఇప్పటికే తమిళనాడు లో థియేటర్లు టికెట్ ధరను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని సమ్మె చేస్తున్న సంగతి విధితమే.. కాగా తాజాగా ఏపీలోని సినిమా టికెట్స్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మల్టీ ప్లెక్స్ లో రిక్లయినర్ సీట్లకు రూ.300, మిగిలిన టికెట్స్ ధర రూ.200 గా ఉండనున్నాయి.. మిగిలిన థియేటర్ల టికెట్ ధర టికెట్ ధర, జీఎస్టీ పన్ను కలిపితే.. రూ.118 అవుతుంది.. ఈ మేరకు గత కొద్ది రోజుల క్రితమే ఆర్ధక, హోమ్, రెవెన్యూ శాఖల అధికారులతో తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ప్రతినిధులు సమావేశమయ్యారు. టిక్కెట్ ధరల పెంపుపై చర్చించారు. ఈ క్రమంలో త్వరలోనే టికెట్ల ధరల పెంపునకు సంబందించి ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీంతో రిలాక్స్ కోసం సినిమానే సాధనంగా చేసుకొన్న సామాన్యుడు టికెట్ పెంపుతో వినోదం కూడా భారంగా మారింది.. అని చెప్పవచ్చు..
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









