వేశ్యతో ప్రేమలో.. కదిలించే ప్రేమకథ..
- July 06, 2017
క్షణ కాల సుఖం కోసం వేశ్యావాటికలోకి అడుగుపెట్టిన ఓ యువకుడిని ఓ వేశ్య అమితంగా కదిలించింది. ఇలాంటి అమ్మాయితో క్షణాల సుఖాన్ని కోరుకునే కన్నా.. జీవితాంతం తనకు తోడుగా మలుచుకోవాలని భావించాడు. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడి.. ఆపై ఆమెనూ ఒప్పించి.. ఇప్పుడు పెళ్లికి సిద్దమవుతున్నాడు.
అచ్చు సినిమా కథను తలపిస్తున్న ఈ ఘటన రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలో డ్రైవరుగా పనిచేస్తున్న 28ఏళ్ల యువకుడు ఇటీవల జీబీరోడ్డులో ఉన్న ఓ వేశ్యావాటికకు వెళ్లాడు. 27 ఏళ్ల వ్యభిచారిణితో పడక సుఖం కోసం గదిలోకి అడుగుపెట్టాడు. కానీ ఆమెను చూశాక అతని మనసు మారిపోయింది.
కొన్నాళ్లు విటుడిగానే ఆ వేశ్యాగృహానికి వెళ్లిన యువకుడు.. ఆ తర్వాత తన మనసులోని మాటను బయటపెట్టేశాడు. ఇందుకు యువతి కూడా అంగీకారం తెలపడంతో.. ఢిల్లీ మహిళా కమిషన్ అధికారులను కలిసి ఆమెకు వేశ్యాగృహం నుంచి విముక్తి కల్పించాలని కోరాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను బయటకు తీసుకొచ్చారు.
యువకుడి నిర్ణయానికి అతని తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో.. త్వరలోనే అతను ఆ యువతిని పెళ్లాడబోతున్నాడు. వేశ్యాగృహంలో ప్రేమలో పడ్డ అతని కథ ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారని ఢిల్లీ మహిళా కమిషన్ అధికారులు చెబుతున్నారు.
కాగా, వేశ్యాగృహంలో మగ్గిపోయిన ఆ యువతి నేపాల్ నుంచి బతుకుదెరువు కోసం ఇండియాకు వలస వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీకి చేరుకోగా.. జీబీ రోడ్డులోని వేశ్యాగృహంలో అనూహ్యంగా చిక్కుకుపోయింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







