అమర్నాథ్ యాత్రలో తెలుగువారి మృతి
- July 06, 2017
బస్సులో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న ఇద్దరు తెలుగువారు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. గురువారం కుల్గాం జిల్లా క్వాజీగుండ్ సమీపంలోని వీసు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర్ప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న ఈ బస్సు 44 మంది యాత్రికులతో జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్కు చెందిన గంగ (పురుషుడు)గా గుర్తించారు. మరొకరు తెలంగాణలోని కామారెడ్డికి చెందిన వ్యక్తి అని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందికి క్వాజీగుండ్లోని అత్యవసర ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. మిగిలిన వారిని అనంతనాగ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో పాటు హైదరాబాద్కు చెందిన మరికొందరితో కలిసి అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణమవుతుండగా గురువారం సాయంత్రం బస్సు ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందింది.
కామారెడ్డికి చెందిన ఒకరు, మాచారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని బస్సులో ఉన్న విశ్వనాథం అనే యాత్రికుడు 'న్యూస్టుడే'కు ఫోన్లో సమాచారం అందించారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయిందని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







