డబ్బు ఇవ్వకపోతే ఫోటోలు చూపిస్తానన్న మహిళను బెదిరిస్తున్న ఒమనీ వ్యక్తి అరెస్ట్
- July 07, 2017
మస్కట్ : ఆన్ లైన్ లో..ఆడపేరుతో ఉన్న ఒక మేకవన్నె పులి మాదిరిగా ఉన్న మగాడిని గుడ్డిగా నమ్మింది ...తన వ్యక్తిగత విషయాలను పూసా గుచ్చినట్లు చెప్పడమే కాక, అందుకు సంబంధించిన ఫోటోలను ఆ అపరిచిత వ్యక్తికి పంపింది..వాటినన్నింటిని జాగ్రత్త చేసుకొని....తన ఫోటోలను తనకి పంపి భారీ మొత్తంలో డబ్బు ఇవ్వకపోతే పరువును బజారున పెడతానన్న నిందితుడిపై పిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయించింది ఒక మహిళను 6,000 రియల్ ఒమాన్ డబ్బును ఇవ్వవలసిందిగా బెదిరించినందుకు బురైమి నుండి ఒక ఒమన్ వ్యక్తిని రాయల్ ఒమాన్ పోలీసులు అరెస్టు చేశారు..ఒకరు, "ఒక వ్యక్తి తనను బెదిరిస్తున్నట్లుగా ఒక ఒమాని మహిళ బురైమి పోలీస్ స్టేషన్ లో రాయల్ ఒమాన్ పోలీస్ అధికారికి ఫిర్యాదు చేసింది.వాట్స్ అప్ నుంచి నిందితుడు వేధిస్తున్నట్లు తానూ ఒక అమ్మాయినని తనను సంప్రదించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కొంత కాలవ్యవధిలో కొన్ని వ్యక్తిగత చిత్రాలను వాట్స్ అప్ ద్వారా అటు ఇటూ మార్చుకున్నట్లు ఆ మహిళ తెలిపింది. కొంతకాలం గడిచిన తర్వాత తన ఫోటోలను తనకే పంపి తన ఆర్థిక డిమాండ్లకు ఒప్పుకోకపోతే తన ఫోటోలను బహిరంగంగా అందరికి చూపి అల్లరి చేస్తానని బెదిరిస్తున్నట్లు ఆమె ఆరోపించింది. దీనికి భయపడిన తానూ ఒక సంవత్సరం పాటు ప్రతినెల 500 రియల్ ఒమాన్ డబ్బును అమ్మాయి పేరుతో ఉన్న నిందితునికి చెల్లించినట్లు వాపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తి తనకు మరింత డబ్బు అవసరమని ఆ డబ్బు కోసం మరింత డిమాండ్ చేస్తున్నట్లు బాధితురాలు పోలీసుల వద్ద చెప్పింది. చెప్పారు. "ఆమె మరింత డబ్బును చెల్లించకపోతే భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సివస్తుందని ఆ మహిళ బెదిరిపోయింది. " సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల నుండి స్నేహపూర్వక అభ్యర్థనలకు లొంగి వారిని ఆమోదించినప్పుడు ఇటువంటి ఇబ్బందులు తప్పవని సామాజిక మాధ్యమ వినియోగదారులను పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు..
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







