మంచాన పడి ఆర్ధిక సహాయం అర్థిస్తున్న ప్రవాసీయ భారతీయుడు
- July 07, 2017
మనామ: గత 12 సంవత్సరాలుగా బహ్రెయిన్ లో నివసిస్తున్న భారతీయ ప్రవాస భారతీయుడు ఆరోగ్యం పాడవడంతో సల్మనియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్. ఎం.సి.) లో చేరడంతో పాటు ఆర్థిక సహాయం చేసేవారు లేకపోవంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒక పంప్ ఆపరేటర్ గా పని చేస్తున్న సునీల్ కుమార్ 46, మే 29 న తలనొప్పి మరియు వాంతులు రావడంతో ఆసుపత్రికి తీసుకు వచ్చారు, దీని వలన ఆయన స్పృహ కోల్పోయాడు. వైద్యపరమైన నివేదికలు ప్రకారం ఆయనకు స్ట్రోక్ సంభవించడంతో పాటు మెదడులో రసాయనిక మార్పులు జరిగి రక్తం గడ్డ కట్టడం జరిగిందని తెలుస్తుంది. "సునీల్ ప్రస్తుతం సల్మనియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్. ఎం.సి.) వద్ద పాక్షిక పక్షవాతానికి గురయ్యాడని ఆయనను వెంటనే భారతదేశానికి వెంటనే పంపాలని వైద్యులు సూచిస్తున్నారు.ఎందుకంటే ఇద్దరు పారామెడికల్ సిబ్బంది సహాయంతో సునీల్ కుమార్ ను తోడుగా పంపవల్సి ఉంది. ఇందుకై 3000 బిడి కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది," అని ఒక ఐ సి ఆర్ ఎఫ్ స్వచ్చంద కార్యకర్త చెప్పారు. ఆయనకు ఆర్ధిక సహాయం చేసేందుకు కానీ ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని తమలాగే మరికొందరు ప్రజలు ముందుకు వచ్చి వైద్య చికిత్స కోసం ఆర్థికంగా మద్దతు ఇవ్వాలని కోరారు. తన కుటుంబంలో సునీల్ మాత్రమే సంపాదనపరుడు కావడంతో ఈ వైద్య అవసర రిస్థితిలో వారివద్ద డబ్బు లేదని తన కుటుంబం అంత పెద్ద మొత్తంలో సమకూర్చడం సాధ్యం కాలేదు,ఆయన కుటుంబంతో కల్సి మిగిలిన ఒక మంచి జీవితం జీవించడానికి దాతలు ఆర్ధిక సహాయం చేయాలనిఆ స్వచ్ఛంద కార్యకర్త పేర్కొన్నారు. సునీల్ కు విరాళంగా డబ్బుని ఇవ్వాలని కోరుకునే వారు సుధీర్ తిరునీలట్ ఫోన్ చేసి 39461746 మరిన్ని వివరాల కోసం సంప్రదించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







