ఖతిఫ్ తీవ్రవాద దాడిలో భద్రతా అధికారి మృతి

- July 07, 2017 , by Maagulf
ఖతిఫ్ తీవ్రవాద దాడిలో భద్రతా అధికారి మృతి

ధమ్మం : తూర్పు ప్రాంతంలోని అల్-ముసావరా, ఖతిఫలో గురువారం ఉదయం జరిగిన  తీవ్రవాద దాడిలో భద్రతా అధికారి చనిపోగా మరో ఆరుగురు భద్రతా సిబ్బంది  గాయపడ్డారు. వీరంతా గస్తీ విధుల్లో ఉండగా తీవ్రవాద దాడి జరిగింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖలో భద్రతా ప్రతినిధి మేజర్ జనరల్ మన్సూర్ అల్-తుర్కి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉదయం10 గంటల సమయంలో తీవ్రవాదులు  పేలుడు పదార్థాలతో దాడి చేసారని ఆయన చెప్పారు. ఈ ఘటనలో  గాయపడిన భద్రతా సిబ్బందిని ఆసుపత్రికి తీసుకెళ్లారు  దాడికి గురైన వారిలోఒక భద్రతా అధికారి - వైస్ సెర్జెంట్ ఆడెల్ ఫాలిహ్ అల్-ఓటిబీ - మంగళవారం చనిపోగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.తూర్పు ప్రావిన్స్లోని తీవ్రవాదుల కోసం ఒక ముఖ్య కేంద్రం లక్ష్యంగా ఉంది. ఆ  పొరుగును పునరుద్ధరించడానికి చేస్తున్న అభివృద్ధి ప్రణాళిక నిర్మాణాన్ని నిలిపివేసే ప్రయత్నంలో పదేపదే తీవ్రవాద దాడులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com