ఇండిగో కు తృటిలో తప్పిన ప్రమాదం
- July 08, 2017
ల్లీ నుంచి ముంబై వెళ్లడానికి టేకాఫ్కు సన్నద్ధమవుతున్న ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. పార్కింగ్ బేలోకి వచ్చిన స్పైస్జెట్ విమానం జెట్ బ్లాస్ట్ అయింది. దీని ప్రభావంతో ఇండిగో విమానంలో విండో పగిలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని ఇండిగో అధికార ప్రతినిధి చెప్పారు. ఆ బ్లాస్ట్ ప్రభావంతో తమ ఎయిర్క్రాఫ్ట్ కుడివైపు ముందున్న విండో పగిలిపోయినట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయని చెప్పారు. వెంటనే వారిని ఎయిర్పోర్టులోని క్లినిక్కు తరలించి, చికిత్స అందించనట్టు చెప్పారు. ఈ ప్రమాదంపై ఏవియేషన్ వాచ్డాగ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ జరుపుతోంది.
''ఇండిగో కోచ్ నెంబర్ 34 ఈబే 17లో శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు ఢిల్లీ-ముంబై మార్గంలో వెళ్లే బోర్డింగ్ ప్రయాణికులతో సిద్ధంగా ఉంది. అదే సమయంలో స్పైస్జెట్ ఎస్జీ-253 ఎయిర్క్రాఫ్ట్ వచ్చింది. దానికి కేటాయించిన బేలో పార్కింగ్ చేసుకునేందుకు టర్న్ అవుతోంది. ఆ సమయంలో జెట్ బ్లాస్ట్ అయింది. దీంతో ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ముందున్న కుడివైపు విండో గ్లాస్ పగిలిపోయింది'' అని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రమాదంపై స్పైస్జెట్ స్పందించలేదు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







