నేటి నుంచి హైదరాబాద్ - కొలంబో విమాన సర్వీసు
- July 11, 2017
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు శ్రీలంక ఎయిర్లైన్స్ నాన్ స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించనుందని జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జిహెచ్ఐఎఎల్) వెల్లడించింది. బుధవారం నుంచి హైదరాబాద్-కొలంబో మధ్య విమాన సర్వీసు ప్రారంభం కానుందని తెలిపింది. వారంలో నాలుగు రోజులు (సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం) ఎ320 విమానం ద్వారా ఈ సర్వీసును శ్రీలంక ఎయిర్లైన్స్ నడపనుందని పేర్కొంది. కొలంబోలో భారతీయ ప్రయాణికులు ఎలాం టి ఆటంకాలు ఎదుర్కొనకుండా ఉండేందుకు శ్రీలంక ఇ-వీసాను అందుబాటులో ఉంచిందని తెలిపింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మరో అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించటం ఎంతో సంతోషాన్నిస్తోందని, ఈ కొత్త విమాన సర్వీసు ద్వారా దక్షిణ, మధ్య భారత్కు చెందిన ప్రయాణికులు నేరుగా శ్రీలంకకు చేరుకోవచ్చని జిహెచ్ఐఎఎల్ సిఇఒ ఎస్జికె కిశోర్ తెలిపారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







