నేటి నుంచి హైదరాబాద్ - కొలంబో విమాన సర్వీసు
- July 11, 2017
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు శ్రీలంక ఎయిర్లైన్స్ నాన్ స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించనుందని జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జిహెచ్ఐఎఎల్) వెల్లడించింది. బుధవారం నుంచి హైదరాబాద్-కొలంబో మధ్య విమాన సర్వీసు ప్రారంభం కానుందని తెలిపింది. వారంలో నాలుగు రోజులు (సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం) ఎ320 విమానం ద్వారా ఈ సర్వీసును శ్రీలంక ఎయిర్లైన్స్ నడపనుందని పేర్కొంది. కొలంబోలో భారతీయ ప్రయాణికులు ఎలాం టి ఆటంకాలు ఎదుర్కొనకుండా ఉండేందుకు శ్రీలంక ఇ-వీసాను అందుబాటులో ఉంచిందని తెలిపింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మరో అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించటం ఎంతో సంతోషాన్నిస్తోందని, ఈ కొత్త విమాన సర్వీసు ద్వారా దక్షిణ, మధ్య భారత్కు చెందిన ప్రయాణికులు నేరుగా శ్రీలంకకు చేరుకోవచ్చని జిహెచ్ఐఎఎల్ సిఇఒ ఎస్జికె కిశోర్ తెలిపారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









