కరీం నగర్ ని లండన్ చేస్తా - సీఎం కెసిఆర్ హామీ
- July 12, 2017
జనాలని ఆకర్షించడం, కేవలం మాటలతో వారిని కేరింతలు కొట్టించడం, అరచేతిలో మాటలలోనే స్వర్గం చూపించడం లో తెలంగాణా ముఖ్యమంత్రి కి తిరుగు లేదు అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల లోనే కాదు యావత్ సౌత్ ఇండియా లోనే కెసిఆర్ ది ఆ లెక్కలో తిరుగులేని స్టైల్. ఈ మధ్య కరీం నగర్ పర్యటన చేసిన కెసిఆర్ అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు.
రెండు సంవత్సరాల లో తాను హేలీకాప్టర్ లో వెళుతుంటే కరీం నగర్ ప్రాంతం మీదనుంచి వెళ్తూ ఉంటె తనకి ఒక పెద్ద అడవి కనపడాలని మూడవ విడత హరితహారం సందర్భంగా చెప్పారు కెసిఆర్.ఇదివరకు కరీం నగర్ కి వచ్చినప్పుడు ఇచ్చిన హామీనే కెసిఆర్ మళ్ళీ చెప్పుకొచ్చారు. అదేంటంటే ఇక్కడి రహదారులు అన్నీ అద్దాలు లాగా మెరిసేలా చేస్తా అనీ లండన్ స్టైల్ లో రోడ్లు వేస్తా అనీ అన్నారు కెసిఆర్. కరీంనగర్ కు లండన్ స్థాయి సొగబులు అద్దుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
లండన్ నగరానికి థేమ్స్ నది పక్కనే ఉన్నట్టుగా, కరీంనగర్ కు మానేరు ఉందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఇటీవలే రూ. 500 కోట్లతో ఒక టూరిజం ప్రాజెక్టును కేటాయించామని సీఎం గుర్తు చేశారు. కరీంనగర్ లో రోడ్లన్నీ త్వరలోనే రూపు మారుతాయనీ, లండన్ నగరాన్ని తలపించేలా తయారు చేస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!
- పునరాలోచన చేయండి..షురా కౌన్సిల్ కు ప్రభుత్వం విజ్ఞప్తి..!!
- అమీర్పేట్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం..
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!









