కరీం నగర్ ని లండన్ చేస్తా - సీఎం కెసిఆర్ హామీ
- July 12, 2017
జనాలని ఆకర్షించడం, కేవలం మాటలతో వారిని కేరింతలు కొట్టించడం, అరచేతిలో మాటలలోనే స్వర్గం చూపించడం లో తెలంగాణా ముఖ్యమంత్రి కి తిరుగు లేదు అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల లోనే కాదు యావత్ సౌత్ ఇండియా లోనే కెసిఆర్ ది ఆ లెక్కలో తిరుగులేని స్టైల్. ఈ మధ్య కరీం నగర్ పర్యటన చేసిన కెసిఆర్ అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు.
రెండు సంవత్సరాల లో తాను హేలీకాప్టర్ లో వెళుతుంటే కరీం నగర్ ప్రాంతం మీదనుంచి వెళ్తూ ఉంటె తనకి ఒక పెద్ద అడవి కనపడాలని మూడవ విడత హరితహారం సందర్భంగా చెప్పారు కెసిఆర్.ఇదివరకు కరీం నగర్ కి వచ్చినప్పుడు ఇచ్చిన హామీనే కెసిఆర్ మళ్ళీ చెప్పుకొచ్చారు. అదేంటంటే ఇక్కడి రహదారులు అన్నీ అద్దాలు లాగా మెరిసేలా చేస్తా అనీ లండన్ స్టైల్ లో రోడ్లు వేస్తా అనీ అన్నారు కెసిఆర్. కరీంనగర్ కు లండన్ స్థాయి సొగబులు అద్దుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
లండన్ నగరానికి థేమ్స్ నది పక్కనే ఉన్నట్టుగా, కరీంనగర్ కు మానేరు ఉందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఇటీవలే రూ. 500 కోట్లతో ఒక టూరిజం ప్రాజెక్టును కేటాయించామని సీఎం గుర్తు చేశారు. కరీంనగర్ లో రోడ్లన్నీ త్వరలోనే రూపు మారుతాయనీ, లండన్ నగరాన్ని తలపించేలా తయారు చేస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







