యునైటెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్‌ ఫండ్‌ ప్రచారకర్తగా 'సూపర్‌వుమెన్‌'

- July 15, 2017 , by Maagulf
యునైటెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్‌ ఫండ్‌ ప్రచారకర్తగా 'సూపర్‌వుమెన్‌'

 యూనిసెఫ్‌(యునైటెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్‌ ఫండ్‌) సుహృద్భావ ప్రచార కర్తగా యూట్యూబ్‌ స్టార్‌, భారత సంతతికి చెందిన సూపర్‌వుమెన్‌ లిల్లీ సింగ్‌ నియమితులయ్యారు. శుక్రవారం ఈ విషయాన్ని యూనిసెఫ్‌ అధికారికంగా ప్రకటించింది. యూనిసెఫ్‌ నిర్వహించే 'యూత్‌ ఫర్‌ ఛేంజ్‌' కార్యక్రమంలో లిల్లీ భాగస్వామురాలిగా మారారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, బాలకార్మికులు, లింగవివక్ష తదితర అంశాల గురించి యూనిసెఫ్‌ నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు ఇక నుంచి సూపర్‌వుమెన్‌ ప్రాతినిథ్యం వహిస్తారు. సుహృద్భావ ప్రచార కర్తగా నియమితులైనందుకు లిల్లీ ఆనందం వ్యక్తం చేశారు. యూట్యూబ్‌లో 'సూపర్‌వుమెన్‌' పేరుతో ప్రత్యేక ఛానెల్‌ ద్వారా ఆమె చేస్తున్న వీడియోలు ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ ఛానెల్‌ను దాదాపు 11.9 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారు. బాలల హక్కుల కోసం యూనిసెఫ్‌ చేపట్టే ఈ బృహత్తర కార్యక్రమానికి ఆమె ఛానెల్‌ను వేదికగా ఉపయోగించుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com