యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ ప్రచారకర్తగా 'సూపర్వుమెన్'
- July 15, 2017
యూనిసెఫ్(యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్) సుహృద్భావ ప్రచార కర్తగా యూట్యూబ్ స్టార్, భారత సంతతికి చెందిన సూపర్వుమెన్ లిల్లీ సింగ్ నియమితులయ్యారు. శుక్రవారం ఈ విషయాన్ని యూనిసెఫ్ అధికారికంగా ప్రకటించింది. యూనిసెఫ్ నిర్వహించే 'యూత్ ఫర్ ఛేంజ్' కార్యక్రమంలో లిల్లీ భాగస్వామురాలిగా మారారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, బాలకార్మికులు, లింగవివక్ష తదితర అంశాల గురించి యూనిసెఫ్ నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు ఇక నుంచి సూపర్వుమెన్ ప్రాతినిథ్యం వహిస్తారు. సుహృద్భావ ప్రచార కర్తగా నియమితులైనందుకు లిల్లీ ఆనందం వ్యక్తం చేశారు. యూట్యూబ్లో 'సూపర్వుమెన్' పేరుతో ప్రత్యేక ఛానెల్ ద్వారా ఆమె చేస్తున్న వీడియోలు ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ ఛానెల్ను దాదాపు 11.9 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారు. బాలల హక్కుల కోసం యూనిసెఫ్ చేపట్టే ఈ బృహత్తర కార్యక్రమానికి ఆమె ఛానెల్ను వేదికగా ఉపయోగించుకోనున్నారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







