'డ్రగ్స్' నేపథ్యంలో నయనతార కథానాయికగా 'వాసుకి'
- July 15, 2017
'డ్రగ్స్' వ్యవహారంలో టాలీవుడ్ పరేషాన్ అవుతోంది. `డ్రగ్స్` డీల్తో సంబంధం ఉన్న కొందరు యువహీరోలు, హీరోయిన్లు, దర్శకనిర్మాతలు `సిట్` ముందు విచారణకు రెడీ అవుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్లోనే కథానాయిక భావన కిడ్నాప్, అత్యాచారం ఉదంతంలో హీరో దిలీప్ అరెస్టు మాలీవుడ్లో ప్రకంపనాలు రేపుతోంది. రెండు పరిశ్రమల్లో ఒకటే కల్లోలం. అయితే ఈ రెండు పరిశ్రమలతో ముడిపడి .. ఇదే తరహా ఉదంతాలతో సంబంధం ఉన్న కథాంశంతో నయనతార కథానాయిక నటించిన ఓ సినిమా ఇప్పుడు రిలీజ్కి రెడీ అవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
మలయాళ బ్లాక్బస్టర్ `పుదియ నియమం` తెలుగులో `వాసుకి`గా రిలీజవుతోంది. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా కథాంశం డ్రగ్స్, అత్యాచారం బ్యాక్డ్రాప్లో ఉంటుందని తెలుస్తోంది. డ్రగ్స్ బాధితులైన కొందరు యువకులు ఎలాంటి అఘాయిత్యం చేశారో తెరపై చూడాల్సిందేనని మేకర్స్ చెబుతున్నారు.
ఇకపోతే `డ్రగ్స్`కి బానిసలైన వాళ్లు ఎలా ప్రవర్తిస్తారు? అన్నది ఈ సినిమాలో అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. మలయాళంలో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాని, త్వరలోనే తెలుగులో భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







