'డ్రగ్స్' నేపథ్యంలో నయనతార కథానాయికగా 'వాసుకి'
- July 15, 2017
'డ్రగ్స్' వ్యవహారంలో టాలీవుడ్ పరేషాన్ అవుతోంది. `డ్రగ్స్` డీల్తో సంబంధం ఉన్న కొందరు యువహీరోలు, హీరోయిన్లు, దర్శకనిర్మాతలు `సిట్` ముందు విచారణకు రెడీ అవుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్లోనే కథానాయిక భావన కిడ్నాప్, అత్యాచారం ఉదంతంలో హీరో దిలీప్ అరెస్టు మాలీవుడ్లో ప్రకంపనాలు రేపుతోంది. రెండు పరిశ్రమల్లో ఒకటే కల్లోలం. అయితే ఈ రెండు పరిశ్రమలతో ముడిపడి .. ఇదే తరహా ఉదంతాలతో సంబంధం ఉన్న కథాంశంతో నయనతార కథానాయిక నటించిన ఓ సినిమా ఇప్పుడు రిలీజ్కి రెడీ అవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
మలయాళ బ్లాక్బస్టర్ `పుదియ నియమం` తెలుగులో `వాసుకి`గా రిలీజవుతోంది. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా కథాంశం డ్రగ్స్, అత్యాచారం బ్యాక్డ్రాప్లో ఉంటుందని తెలుస్తోంది. డ్రగ్స్ బాధితులైన కొందరు యువకులు ఎలాంటి అఘాయిత్యం చేశారో తెరపై చూడాల్సిందేనని మేకర్స్ చెబుతున్నారు.
ఇకపోతే `డ్రగ్స్`కి బానిసలైన వాళ్లు ఎలా ప్రవర్తిస్తారు? అన్నది ఈ సినిమాలో అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. మలయాళంలో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాని, త్వరలోనే తెలుగులో భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









