ఫేక్ టిక్కెట్లు విక్రయించిన ట్రావెల్ ఏజెన్సీ వర్కర్
- July 17, 2017
షార్జా: ట్రావెల్ ఏజెన్సీకి చెందిన బుకింగ్ ఉద్యోగి అక్రమంగా ఫేక్ టిక్కెట్లను విక్రయిస్తున్నందుకుగాను అరెస్ట్ అయ్యాడు. 400,000 దిర్హామ్ల విలువైన ఫేక్ టిక్కెట్లను నిందితుడు విక్రయించినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. ఫేక్ ఆఫర్లతో వినియోగదారుల్ని నిందితుడు బురిడీ కొట్టించాడని పోలీసులు చెప్పారు. చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించగా అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు వివరించడం జరిగింది. నిందితుడి వద్ద టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణీకులు, అవి ఫేక్ అని తెలియక విమానాశ్రాయినికి వెళ్ళి అక్కడ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారని పోలీసులు చెప్పారు. షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ బ్రిగేడియర్ సైఫ్ మొహమ్మద్ అల్ జారి మాట్లాడుతూ, బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న వెంటనే స్పందించినట్లు తెలిపారు. ఇలాంటి నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







