సాంకేతిక లోపం ఏర్పడటంతో మరో విమానంలో ప్రయాణికులు తరలింపు

- July 17, 2017 , by Maagulf
సాంకేతిక లోపం ఏర్పడటంతో మరో విమానంలో  ప్రయాణికులు  తరలింపు

ఒమన్ కు చెందిన ఒక విమానం మస్కట్ - బెంగుళూరు మార్గంలో ప్రయాణించాల్సి ఉండగా  సురక్షితంగా వెనుతిరిగి తన సొంత స్థావరానికి చేరుకొంది. సోమవారం ఉదయం 10.25 గంటలకు  బయలుదేరిన ఆ విమానంకు సాంకేతిక లోపం ఏర్పడింది. 154 మంది ప్రయాణికులతో డబ్ల్యూ వై  283 బోయింగ్ 737-800 విమానం ముగ్గురు శిశువులు మరియు ఆరుగురు విమానం నడిపే సిబ్బంది సభ్యులు  ఉన్నారు. "బాగా శిక్షణ పొందిన సిబ్బందికి నైపుణ్యానికి ధన్యవాదాలు, విమానంలో ప్రయాణిస్తున్న  అతిధులందరికి ఇక ముందు ఎటువంటి అసౌకర్యాన్ని కల్గించమని ఎయిర్లైన్స్ తెలిపింది. అతిథులు మరియు సిబ్బంది సజావుగా వెళ్లిపోయారు. ఆ ప్రయాణికులను అందర్నీ అదే నెంబర్ గల  మరో విమానంలో తిరిగి మస్కట్  సాయంత్రం 3 గంటల సమయంలో పంపించారు. "ఒమన్ ఎయిర్  అత్యధిక మందితో తరలించడమే ప్రాతిపదిక కాక   వినియోగదారులందరికీ, ఉద్యోగుల శ్రేయస్సును కాపాడటం, వైమానిక సంస్థ దాని అసమర్థ భద్రత రికార్డు గురించి గర్వపడింది. ఒమన్ ఎయిర్ సమస్యాత్మకంగా ఏర్పడిన అడ్డంకులను ఏవిధంగా అధిగమించాలో తెలుసునని అందుకు అనుగుణంగా  సిబ్బందికి విస్తృతమైన శిక్షణను అందించి తమ  ప్రయాణీకుల భద్రతకు హామీ ఇస్తామని తెలిపింది. అంతేకాక తమ నెట్వర్క్ పరిధిలో అన్ని విమానాశ్రయ అధికారులతో కలిసి తమ విమాన సంస్థ పనిచేస్తోందన్నారు. జరిగిన ఈ సంఘటన ద్వారా సిబ్బింది శిక్షణ మరియు సహకారం రుజువు చేస్తుందని తెలిపింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాయల్ ఒమాన్ పోలీసులు,ఒమన్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కంపెనీ సహకారం సహాయం కొరకు సివిల్ ఏవియేషన్  పబ్లిక్ అథారిటీ సిబ్బందికి ఒమన్ ఎయిర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com