3,652 మంది భర్తలకు భరణం చెల్లించాలని ఆదేశం
- July 19, 2017
రియాద్: సౌదీ ఎన్ఫోర్స్మెంట్ న్యాయస్థానాలు, మొత్తం 3,652 మంది భర్తలు తమ భార్యలకు భరణం చెల్లించాల్సిందిగా ఈ ఏడాది వ్యాప్తంగా పలు కేసుల్లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విడాకులు పొందిన, వదిలివేయబడిన భార్యలు, వారి పిల్లల కోసం ఈ భరణాల్ని ఆయా వ్యక్తులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ భరణం చెల్లించని పక్షంలో కఠినమైన జరీమానాలు, అలాగే జైలు శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జస్టిస్ మినిస్టర్ వాలిద్ అల్ సమాని ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. మినిస్ట్రీకి చెందిన అండర్ సెక్రెటరీ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ హమాద్ అల్ కుదైరి మాట్లాడుతూ, భరణం చెల్లించనివారు ఏడేళ్ళ జైలు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉందని వివరించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







