3,652 మంది భర్తలకు భరణం చెల్లించాలని ఆదేశం

- July 19, 2017 , by Maagulf
3,652 మంది భర్తలకు భరణం చెల్లించాలని ఆదేశం

రియాద్‌: సౌదీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ న్యాయస్థానాలు, మొత్తం 3,652 మంది భర్తలు తమ భార్యలకు భరణం చెల్లించాల్సిందిగా ఈ ఏడాది వ్యాప్తంగా పలు కేసుల్లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విడాకులు పొందిన, వదిలివేయబడిన భార్యలు, వారి పిల్లల కోసం ఈ భరణాల్ని ఆయా వ్యక్తులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ భరణం చెల్లించని పక్షంలో కఠినమైన జరీమానాలు, అలాగే జైలు శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జస్టిస్‌ మినిస్టర్‌ వాలిద్‌ అల్‌ సమాని ఈ మేరకు ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. మినిస్ట్రీకి చెందిన అండర్‌ సెక్రెటరీ ఫర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ హమాద్‌ అల్‌ కుదైరి మాట్లాడుతూ, భరణం చెల్లించనివారు ఏడేళ్ళ జైలు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉందని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com