పాస్‌పోర్ట్ దరఖాస్తుకి జనన ద్రువీ కరణ పత్రం తో పనిలేదు

- July 23, 2017 , by Maagulf
పాస్‌పోర్ట్ దరఖాస్తుకి జనన ద్రువీ కరణ పత్రం తో పనిలేదు

ఇకపై భారతీయులు పాస్‌పోర్ట్ పొందడం మరింత సులువు.  బర్త్ సర్టిఫికెట్ స్థానంలో ఆధార్ లేదా పాన్‌కార్డ్‌లను పరిగణలలోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది.  పాత నిబంధనల ప్రకారం జనవరి 26, 1989 తర్వాత పుట్టిన వారు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే సమయంలో విధిగా బర్త్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది.  అయితే ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న నిర్ణయం ప్రకారం స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఎల్‌ఐసీ బాండ్లలో ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుందని కేంద్రమంత్రి వీకే సింగ్ పార్లమెంటుకు తెలిపారు. అలాగే 60 ఏళ్లు పైబడిన పెద్దవారికి, 8 ఏళ్ల లోపు చిన్నారులకు పాస్‌పోర్టు ఫీజులో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలియజేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com