యెమెన్లో చిన్నారుల హక్కులను ఉల్లంఘిస్తున్న సౌదీ కూటమి :బాలల హక్కుల సంఘాల ఫిర్యాదు
- July 23, 2017
- ఐరాసకు బాలల హక్కుల సంఘాల ఫిర్యాదు
యెమెన్లోని హౌతీ తిరుగుబాటు దారులపై దాడులుజరుపుతున్న సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి అక్కడి బాలల హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని అక్కడి హక్కుల సంఘాలు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియోగుటెరస్కు ఫిర్యాదు చేశాయి. సౌదీ కూటమి జరిపిన 23 వైమానిక దాడుల్లో అనేక మంది బాలలు క్షతగాత్రులు కావటం, మరణించటం జరిగిందని సేవ్ది చిల్డ్రన్, వాచ్లిస్ట్ ఆన్ చిల్డ్రన్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ సంస్థలు ఈ ఫిర్యాదులో పేర్కొన్నాయి. దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ పోరులో బాలలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సంస్థలు ఐరాసకు విజ్ఞప్తి చేశాయి. యెమెన్లో ఎక్కడ చూసినా వైమానిక దాడులలో ఛిద్రమైన శిధిలాలే కన్పిస్తున్నాయని, ఇక్కడి బాలల దుర్భర స్థితికి ఇందులో ప్రమేయం వున్న అన్ని వర్గాలూ బాధ్యులేనని సేవ్ది చిల్డ్రన్ సంస్థ యెమెన్ డైరెక్టర్ టామర్ కిరోలోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాలలను, వారి ప్రయోజనాలను రక్షించటంపైన, దాడులకు బాధ్యులైన వారిని శిక్షించే అంశంపైన ఐరాస ప్రధాన కార్యదర్శి దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









