ఆగస్టులో వస్తోన్న సునీల్ 'ఉంగరాల రాంబాబు'
- July 25, 2017
సునీల్ హీరోగా నటించిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. క్రాంతి మాధవ్ దర్శకుడు. మియాజార్జ్ కథానాయిక. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు వారాల్లో సెన్సారు కార్యక్రమాలు జరుపుకోవడానికి సిద్ధమౌతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా 'ఉంగరాల రాంబాబు' ఉంటుంది. ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా అందరి అంచనాలు అందుకుని, ఘన విజయం సాధిస్తుంది. ముఖ్యంగా ప్రకాశ్రాజ్, పోసాని, వెన్నెల కిశోర్, అలీ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి' అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









