ఆగస్టులో వస్తున్న 'అర్జున్ రెడ్డి'
- July 25, 2017
పెళ్ళిచూపులు చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించిన హీరో విజయ్ దేవర కొండ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం 'అర్జున్ రెడ్డి'. షాలిని హీరోయిన్గా నటిస్తుంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచే మంచి హైప్ క్రియేట్ చేస్తుంది.
విలక్షణ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపే విజయ్ దేవర కొండ ఈ చిత్రంలో యారోగెంట్ మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనపడబోతున్నాడు. మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ ఫిలింస్తో పాటు కె.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ చివరి వారంలో విడుదల చేస్తున్నాయి.
పోస్టర్స్, టీజర్కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై వచ్చిన అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజెనెస్కు క్రేజ్ ఏర్పడింది. విజువల్ వండర్ బాహుబలి 2 చిత్రాన్ని విడుదల చేసిన ఏషియన్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. రధన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో త్వరలో మార్కట్లోకి విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







