భారత్కు ఫోన్ చేసిన కువైట్ రాజు షేక్ శబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ శబాహ్
- July 26, 2017
గల్ఫ్ దేశాలకు, భారత్కు మధ్య సత్సంబంధాలు ఇటీవల రానురానూ పెరుగుతున్నాయి. పలు సందర్భాల్లో ఓ దేశం నుంచి మరో దేశానికి శుభాకాంక్షలు వెళ్తూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కువైట్ నుంచి భారత్కు ఓ ఫోన్ వచ్చింది. కువైట్ రాజు షేక్ శబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ శబాహ్.. నూతనంగా భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్నాథ్ కోవింద్కు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్కు 14వ రాష్ట్రపతిగా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. కువైట్ రాజుతోపాటు.. యువరాజు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ శబాహ్, ప్రధానమంత్రి షేక్ జబేర్ అల్ ముబారక్ అల్ హమద్ అల్ శబాహ్, కువైట్ పార్లమెంట్ స్పీకర్ మార్జూక్ అల్ ఘనీమ్ కూడా రామ్నాథ్ కోవింద్కు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









