భారత్కు ఫోన్ చేసిన కువైట్ రాజు షేక్ శబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ శబాహ్
- July 26, 2017
గల్ఫ్ దేశాలకు, భారత్కు మధ్య సత్సంబంధాలు ఇటీవల రానురానూ పెరుగుతున్నాయి. పలు సందర్భాల్లో ఓ దేశం నుంచి మరో దేశానికి శుభాకాంక్షలు వెళ్తూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కువైట్ నుంచి భారత్కు ఓ ఫోన్ వచ్చింది. కువైట్ రాజు షేక్ శబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ శబాహ్.. నూతనంగా భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్నాథ్ కోవింద్కు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్కు 14వ రాష్ట్రపతిగా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. కువైట్ రాజుతోపాటు.. యువరాజు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ శబాహ్, ప్రధానమంత్రి షేక్ జబేర్ అల్ ముబారక్ అల్ హమద్ అల్ శబాహ్, కువైట్ పార్లమెంట్ స్పీకర్ మార్జూక్ అల్ ఘనీమ్ కూడా రామ్నాథ్ కోవింద్కు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







