భారత్‌కు ఫోన్ చేసిన కువైట్ రాజు షేక్ శబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ శబాహ్

- July 26, 2017 , by Maagulf
భారత్‌కు ఫోన్ చేసిన కువైట్ రాజు షేక్ శబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ శబాహ్

గల్ఫ్ దేశాలకు, భారత్‌కు మధ్య సత్సంబంధాలు ఇటీవల రానురానూ పెరుగుతున్నాయి. పలు సందర్భాల్లో ఓ దేశం నుంచి మరో దేశానికి శుభాకాంక్షలు వెళ్తూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కువైట్ నుంచి భారత్‌కు ఓ ఫోన్ వచ్చింది. కువైట్ రాజు షేక్ శబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ శబాహ్.. నూతనంగా భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్‌నాథ్ కోవింద్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్‌కు 14వ రాష్ట్రపతిగా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. కువైట్ రాజుతోపాటు.. యువరాజు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ శబాహ్, ప్రధానమంత్రి షేక్ జబేర్ అల్ ముబారక్ అల్ హమద్ అల్ శబాహ్, కువైట్ పార్లమెంట్ స్పీకర్ మార్జూక్ అల్ ఘనీమ్ కూడా రామ్‌నాథ్ కోవింద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com