నవరసాలు పలికించే ఏకైక నటుడు కైకాల సత్యనారాయణ
- July 26, 2017
వెండితెరపై నవరసాలను పలికించగల ఏకైక నటుడు కైకాల సత్యనారాయణ అని మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య అన్నారు. యువకళావాహిని ఆధ్వర్యంలో సినీ నటులు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత కైకాల సత్యనారాయణ దంపతులకు బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్లో సహస్రపూర్ణ చంద్రదర్శన సన్మానం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రోశయ్య మాట్లాడుతూ ఎలాంటి పాత్రలోనైనా జీవించగల సమర్థులు కైకాల అని అన్నారు. విశిష్ట అతిథి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కళాకారులను ప్రభుత్వాలు గుర్తించకపోయినా ప్రజలు వారికి తగిన ప్రాధాన్యమిచ్చి సన్మానించాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. కళాకారులు లక్షల మందికి ఆనందాన్ని పంచుతారన్నారు. అప్పట్లో నటుడే కీలకంగా వ్యవహరించే వాడని.. ఇప్పుడు గ్రాఫిక్స్కు ప్రాధాన్యం పెరుగుతోందని తెలిపారు. కైకాల సత్యనారాయణ లాంటి నటులను సత్కరించుకోవడం ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు.
సీనియర్ నటి జమున మాట్లాడుతూ కైకాల అప్పటి తరంలో ఎన్టిఆర్తో ధీటుగా నటించగలిగారని గుర్తు చేశారు. నటనలో ఆయనకు ఆయనే సాటి అని తెలిపారు. సీనియర్ దర్శకులు రేలంగి నర్సింహారావు మాట్లాడుతూ నటుడిగానే కాకుండా దర్శక నిర్మాతల హితం కోరే వ్యక్తిత్వం కేవలం కైకాలకే సొంతమన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సారిపల్లి కొండలరావు వ్యవహరించగా సీనియర్ నటులు గీతాంజలి, కవిత, గజల్ శ్రీనివాస్, సీనియర్ దర్శకులు కోదండరాంరెడ్డి, గాయని శారద ఆకునూరి, సామాజిక వేత్త కొత్త కృష్ణవేణి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









