హైదరాబాద్లో మాజీమంత్రి ముఖేశ్గౌడ్ కొడుకు విక్రమ్పై కాల్పులు
- July 27, 2017
హైదరాబాద్ సిటీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మాజీమంత్రి ముఖేశ్గౌడ్ కొడుకు విక్రమ్పై గుర్తు తెలియని దుండగులు జరిపారు. ఈ ఘటనలో విక్రం చెయి, కడుపులోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి ఇంటికొచ్చిన విక్రంగౌడ్, పూజ నిమిత్తం ఉదయాన్నే నిద్రలేచాడు. అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండుగుడు కాల్పులు జరిపినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నమాట. నైట్ ఇంటికి వచ్చినప్పుడు విక్రమ్ ఎవరితోనే ఘర్షణ పడినట్టు తెలుస్తోంది. దీంతో వాళ్లే వచ్చి ఆయనపై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదిలావుండగా విక్రమ్ ఇంట్లో లైసెన్స్ లేని గన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







