హైదరాబాద్‌లో మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ కొడుకు విక్రమ్‌పై కాల్పులు

- July 27, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ కొడుకు విక్రమ్‌పై కాల్పులు

హైదరాబాద్ సిటీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ కొడుకు విక్రమ్‌పై గుర్తు తెలియని  దుండగులు జరిపారు. ఈ ఘటనలో విక్రం చెయి, కడుపులోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి ఇంటికొచ్చిన విక్రంగౌడ్, పూజ నిమిత్తం ఉదయాన్నే నిద్రలేచాడు. అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండుగుడు కాల్పులు జరిపినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నమాట. నైట్ ఇంటికి వచ్చినప్పుడు విక్రమ్ ఎవరితోనే ఘర్షణ పడినట్టు తెలుస్తోంది. దీంతో వాళ్లే వచ్చి ఆయనపై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదిలావుండగా విక్రమ్ ఇంట్లో లైసెన్స్ లేని గన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com