హైదరాబాద్లో మాజీమంత్రి ముఖేశ్గౌడ్ కొడుకు విక్రమ్పై కాల్పులు
- July 27, 2017
హైదరాబాద్ సిటీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మాజీమంత్రి ముఖేశ్గౌడ్ కొడుకు విక్రమ్పై గుర్తు తెలియని దుండగులు జరిపారు. ఈ ఘటనలో విక్రం చెయి, కడుపులోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి ఇంటికొచ్చిన విక్రంగౌడ్, పూజ నిమిత్తం ఉదయాన్నే నిద్రలేచాడు. అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండుగుడు కాల్పులు జరిపినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నమాట. నైట్ ఇంటికి వచ్చినప్పుడు విక్రమ్ ఎవరితోనే ఘర్షణ పడినట్టు తెలుస్తోంది. దీంతో వాళ్లే వచ్చి ఆయనపై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదిలావుండగా విక్రమ్ ఇంట్లో లైసెన్స్ లేని గన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









