హైదరాబాద్లో మాజీమంత్రి ముఖేశ్గౌడ్ కొడుకు విక్రమ్పై కాల్పులు
- July 27, 2017హైదరాబాద్ సిటీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మాజీమంత్రి ముఖేశ్గౌడ్ కొడుకు విక్రమ్పై గుర్తు తెలియని దుండగులు జరిపారు. ఈ ఘటనలో విక్రం చెయి, కడుపులోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి ఇంటికొచ్చిన విక్రంగౌడ్, పూజ నిమిత్తం ఉదయాన్నే నిద్రలేచాడు. అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండుగుడు కాల్పులు జరిపినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నమాట. నైట్ ఇంటికి వచ్చినప్పుడు విక్రమ్ ఎవరితోనే ఘర్షణ పడినట్టు తెలుస్తోంది. దీంతో వాళ్లే వచ్చి ఆయనపై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదిలావుండగా విక్రమ్ ఇంట్లో లైసెన్స్ లేని గన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు