జజాన్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధించిన బోర్డర్ గార్డ్ లు
- July 28, 2017
సౌదీ అరేబియా సరిహద్దు జలాల ద్వారా 128 కిలోల హషీష్ మాదకద్రవ్యాన్ని అక్రమ రవాణా చేసేందుకు యత్నించిన నిందితులను జజాన్ లో సరిహద్దు గస్తీ గార్డులు అదుపులోనికి తీసుకొన్నారు. పోలీస్ ప్రతినిధి కల్నేల్ సాహిర్ బిన్ మహమ్మద్ ఆల్ హర్బి మాట్లాడుతూ, యెమెన్ తీరం మీదుగా ఏ అక్రమ మాదక ద్రవ్యాలను బైష్ జిల్లా మీదుగా జజాన్ కు అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించినట్లు ఆయన చెప్పారు. వీరి ప్రయాణంపై అనుమానం కల్గిన సరిహద్దు గస్తీ గార్డులు పడవలో వెతకడం జరిగింది. ఈ అన్వేషణలో చట్టవిరుద్ధమైన హషీష్ మాదకద్రవ్యాలను రహస్యంగా దాచి ఉండటం కనుగోవడంతో లుగురు యెమెన్లని అరెస్టు చేసినట్లు ఆల్ హర్బి తెలిపారు. సౌద్ బిన్ ఫురైజ్ ఆల్ ఓమైన అనే సౌదీ మరియు హంజాహ్ మొహమ్మద్ దావూద్ అల్-ఖతిబ్ అనే జోర్డానియన్ వ్యక్తులకు ఉరిశిక్ష ఖరారు కానుంది. రాజ్యంలోకి అమ్మేటమైన్ మాదక ద్రవ్యాల మాత్రలు అక్రమ రవాణా చేసినట్లు నిరూపితం అవడంతో అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. జనరల్ కోర్టు సైతం వీరు దొంగనాలకు పాల్పడినట్లు చెప్పారు. ఈ విజ్ఞప్తిని అప్పీలు మరియు సుప్రీంకోర్టులచే ఆమోదించబడింది మరియు దానిని అమలు చేయడానికి క్రమంలో ఒక రాజాజ్ఞ జారీ చేయబడింది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









