శ్వేతసౌధం సిబ్బంది చీఫ్గా జనరల్ జాన్ కెల్లీ
- July 30, 2017
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక మార్పు చేశారు. ఇప్పటి వరకు అమెరికా అంతర్గత వ్యవహారాలను పర్యవేక్షించిన కార్యదర్శి జనరల్ జాన్ కెల్లీని శ్వేతసౌధం సిబ్బంది చీఫ్గా నియమించారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఈ విషయం చెప్పేందుకు నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడే నేను జాన్ ఎఫ్.కెల్లీని వైట్హౌస్ స్టాఫ్ చీఫ్గా ప్రకటించాను. ఆయన గొప్ప అమెరికన్. గొప్ప నాయకుడు. అంతర్గత వ్యవహారాల కార్యదర్శిగా ఆయన బృహత్తర విధులు నిర్వర్తించారు. నా పరిపాలన వర్గంలో ఆయన నిజమైన స్టార్' అంటూ ట్రంప్ పేర్కొన్నారు. కెల్లీ రెయిన్స్ ప్రీబస్ స్థానంలో పనిచేయనున్నారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







