శ్వేతసౌధం సిబ్బంది చీఫ్‌గా జనరల్‌ జాన్‌ కెల్లీ

- July 30, 2017 , by Maagulf
శ్వేతసౌధం సిబ్బంది చీఫ్‌గా జనరల్‌ జాన్‌ కెల్లీ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక మార్పు చేశారు. ఇప్పటి వరకు అమెరికా అంతర్గత వ్యవహారాలను పర్యవేక్షించిన కార్యదర్శి జనరల్‌ జాన్‌ కెల్లీని శ్వేతసౌధం సిబ్బంది చీఫ్‌గా నియమించారు. ఈ విషయాన్ని ట్రంప్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 'ఈ విషయం చెప్పేందుకు నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడే నేను జాన్‌ ఎఫ్‌.కెల్లీని వైట్‌హౌస్‌ స్టాఫ్‌ చీఫ్‌గా ప్రకటించాను. ఆయన గొప్ప అమెరికన్‌. గొప్ప నాయకుడు. అంతర్గత వ్యవహారాల కార్యదర్శిగా ఆయన బృహత్తర విధులు నిర్వర్తించారు. నా పరిపాలన వర్గంలో ఆయన నిజమైన స్టార్‌' అంటూ ట్రంప్‌ పేర్కొన్నారు. కెల్లీ రెయిన్స్‌ ప్రీబస్‌ స్థానంలో పనిచేయనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com