మహిళా క్రికెటర్ మిథాలీరాజ్కి బీఎండబ్ల్యూ కారు అందజేత
- August 01, 2017
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు సారథి మిథాలీరాజ్కు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ బీఎండబ్ల్యూ కారును కానుకగా అందజేశారు. గోపీచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాముండేశ్వరినాథ్.. మిథాలీ రాజ్కి కారు తాళాలు అందించారు. ఇంగ్లాండ్లో ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్లో విజయం సాధించిన అనంతరం చాముండేశ్వరినాథ్.. సారథి మిథాలీకి బీఎండబ్ల్యూ కారును అందజేస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గోపిచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మిథాలీకి కారును అందజేశారు. 2016లో రియో ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన పీవీ సింధు, సాక్షి మాలిక్, తృటిలో పతకం చేజార్చుకున్న దీప కర్మాకర్, సింధు కోచ్ గోపిచంద్కి చాముండేశ్వరినాథ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కార్లు అందజేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







