మురసోలి స్వర్ణోత్సవ వేడుకల్లో సినీ హీరోలు రజనీ, కమల్
- August 01, 2017
మురసోలి దిన పత్రిక స్వర్ణోత్సవ వేడుకల్లో నటుడు కమలహాసన్, రజనీకాంత్ పాల్గొననున్నారు.1942లో డీఎంకే నేత కరుణాధి చేతుల మీదగా ప్రారంభించిన వారపత్రిక మురసోలి ఆ తరువాత దిన పత్రికగా మార్చబడి నేటికీ కొనసాగుతోంది.ఈ పత్రిక ప్రారంభమై 75 వసంతాలు పూర్తికావటంతో స్వర్ణోత్సవ వేడకును ఈ నెల 10వ తేదీన చెన్నైలోని కళైవాణర్ ఆవరణలో ఘనంగా నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో నటుడు కమలహసన్, రజనీకాంత్ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. అయితే ఆహ్వాన పత్రికలో ప్రసంగించేవారి పేరుల్లో కమలహాసన్ పేరు మాత్రమే పేర్కొన్నారు.దీంతో రజనీకాంత్ పాల్గొనరనే ప్రచారం జరుగుతుండగా డీఎంకే నిర్వాహకులొకరు రజనీకాంత్ తప్పకుండా ఈ వేడుకలో పాల్గొంటారని, అయితే ఆయన మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆహ్వాన పత్రికలో ఆయన పేరు వేయలేదని వివరించారు.
ప్రధాని శుభాకాంక్షలు
మురసోలి పత్రిక స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని 512 పేజీలతో కూడిన పత్రికను ప్రచరించారు.అందులో 13 మంది ప్రముఖ జాతీయ నాయకులు తమ అభిప్రాయాలతో కూడిన శుభాకాంక్షలను పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదితో పాటు, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, కమ్యూనిస్ట్ పార్టీ నేతలు సీతారాం ఏచూరి, సుధాకరరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







