ప్రపంచంలోనే ఎత్తైన టిబెట్‌ పీఠభూమిపై ఎక్స్‌ప్రెస్‌ మార్గం ప్రారంభం

- August 01, 2017 , by Maagulf
ప్రపంచంలోనే ఎత్తైన టిబెట్‌ పీఠభూమిపై ఎక్స్‌ప్రెస్‌ మార్గం ప్రారంభం

ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి టిబెట్‌పై చైనా ఎక్స్‌ప్రెస్‌ రహదారి మార్గాన్ని ప్రారంభించింది. కింఘై ప్రావిన్సులోని గాంగ్హె కౌంటీని వుషు నగరంతో కలుపుతూ దీన్ని నిర్మించింది. 634.8 కి.మీ. పొడవైన ఈ మార్గం కోసం దాదాపు రూ.25.6వేల కోట్లను చైనా ఖర్చు చేసింది. సగటున 4వేల మీటర్ల ఎత్తులో ఈ రహదారి ఉంటుంది. రహదారిలో 36శాతం పెర్మాఫ్రాస్ట్‌ (మంచు) నేలపైనే నిర్మించారు. వాహనాల వల్ల ఏర్పడే ఉష్ణోగ్రత మార్పులకు ఈ నేల కరిగిపోతుంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేలను స్థిరంగా ఉంచి.. నిర్మాణం చేపట్టారు. ఈ మార్గం ద్వారా యుషు, ప్రావిన్సు రాజధాని షినింగ్‌ల మధ్య ప్రయాణ సమయం.. 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com