ప్రపంచంలోనే ఎత్తైన టిబెట్ పీఠభూమిపై ఎక్స్ప్రెస్ మార్గం ప్రారంభం
- August 01, 2017
ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి టిబెట్పై చైనా ఎక్స్ప్రెస్ రహదారి మార్గాన్ని ప్రారంభించింది. కింఘై ప్రావిన్సులోని గాంగ్హె కౌంటీని వుషు నగరంతో కలుపుతూ దీన్ని నిర్మించింది. 634.8 కి.మీ. పొడవైన ఈ మార్గం కోసం దాదాపు రూ.25.6వేల కోట్లను చైనా ఖర్చు చేసింది. సగటున 4వేల మీటర్ల ఎత్తులో ఈ రహదారి ఉంటుంది. రహదారిలో 36శాతం పెర్మాఫ్రాస్ట్ (మంచు) నేలపైనే నిర్మించారు. వాహనాల వల్ల ఏర్పడే ఉష్ణోగ్రత మార్పులకు ఈ నేల కరిగిపోతుంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేలను స్థిరంగా ఉంచి.. నిర్మాణం చేపట్టారు. ఈ మార్గం ద్వారా యుషు, ప్రావిన్సు రాజధాని షినింగ్ల మధ్య ప్రయాణ సమయం.. 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







