లాస్ వేగాస్లోని హైపర్లూప్ వన్ ప్రయోగంలో మరో మైలురాయి
- August 03, 2017
ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తున్న అధునాతన రవాణా వ్యవస్థ హైపర్లూప్.. కీలక మైలు రాయిని దాటింది. అత్యధిక వేగంతో ప్రయాణీకులను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లే ఈ హైపర్లూప్ స్పీడ్ టెస్ట్లో రికార్డ్ స్థాయి వేగాన్ని అందుకుంది. లాస్ వేగాస్లోని ఎడాది ప్రాంతంలో ఈ పరీక్ష నిర్వహించారు. గంటకు 310 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో మోటర్లు, నియంత్రణ వ్యవస్థ, వాక్యూమ్ సిస్టమ్, మాగ్నటిక్ లావిటేషన్ వ్యవస్థలను పరిశీలించారు. దీంతో.. హైపర్లూప్ అన్నది కేవలం ఊహాజనిత ప్రయోగం కాదని... నిజంగా పనిచేస్తుందని నిరూపించగలిగామని ప్రకటించింది దీన్ని అభివృద్ధి చేస్తున్న హైపర్లూప్ వన్. దీన్ని వేగాన్ని క్రమంగా గంటకు 12 వందల కిలోమీటర్ల వరకూ తీసుకెళ్లేవిధంగా ప్రయోగాలు సాగుతున్నాయి. అమరావతికీ ఈ సాంకేతిక విధానాన్ని తీసుకు రావడానికి హైపర్లూప్వన్ ప్రతినిధులు ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసి చర్చించారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైతే.. అత్యంత వేగంగా భూమిపై ప్రయాణించే అవకాశం అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







