రాజీనామా కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నాడు
- August 04, 2017
భారతీయ వలసదారుడొకరు ఐర్లాండ్ నుంచి షార్జా వచ్చి, ప్రాణాలు కోల్పోయాడు. కారులో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆగస్ట్ 1 నుంచి ఆ వ్యక్తి కనిపించడంలేదని సంబంధీకులు పేర్కొంటున్నారు. షార్జాలో ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు ఆయన వచ్చాడని వారు చెప్పారు. కేరళలోని పెరంబవూర్కి చెందిన 35 ఏళ్ళ డిక్సన్, ఒమ్మిదేళ్ళుగా షార్జా ఎయిర్పోర్ట్ ఫ్రీ జోన్లో ఓ సంస్థలో పనిచేస్తున్నారు. అల్ కులయ్యా ప్రాంతంలో పార్క్ చేసిన కారులో డిక్సన్ మృతదేహం పోలీసులకు దొరికింది. డిక్సన్ మిస్సింగ్పై ఆగస్ట్ 1న ఫిర్యాదు అందుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు విచారణ కొనసాగుతుండగా, డిక్సన్ని విగతజీవిగా కనుగొన్నామని పోలీసులు వివరించారు. మృతదేహాన్ని అల్ కువైటి ఆసుపత్రికి తరలించారు. షార్జాలో ఉద్యోగానికి రాజీనామా చేసి, ఐర్లాండ్లో తన భార్యతో కలిసి ఉండాలనుకున్నాడనీ, ఈలోగా ఈ దారుణం జరిగిందని డిక్సన్ మరో స్నేహితుడు చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









