రాజీనామా కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నాడు
- August 04, 2017
భారతీయ వలసదారుడొకరు ఐర్లాండ్ నుంచి షార్జా వచ్చి, ప్రాణాలు కోల్పోయాడు. కారులో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆగస్ట్ 1 నుంచి ఆ వ్యక్తి కనిపించడంలేదని సంబంధీకులు పేర్కొంటున్నారు. షార్జాలో ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు ఆయన వచ్చాడని వారు చెప్పారు. కేరళలోని పెరంబవూర్కి చెందిన 35 ఏళ్ళ డిక్సన్, ఒమ్మిదేళ్ళుగా షార్జా ఎయిర్పోర్ట్ ఫ్రీ జోన్లో ఓ సంస్థలో పనిచేస్తున్నారు. అల్ కులయ్యా ప్రాంతంలో పార్క్ చేసిన కారులో డిక్సన్ మృతదేహం పోలీసులకు దొరికింది. డిక్సన్ మిస్సింగ్పై ఆగస్ట్ 1న ఫిర్యాదు అందుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు విచారణ కొనసాగుతుండగా, డిక్సన్ని విగతజీవిగా కనుగొన్నామని పోలీసులు వివరించారు. మృతదేహాన్ని అల్ కువైటి ఆసుపత్రికి తరలించారు. షార్జాలో ఉద్యోగానికి రాజీనామా చేసి, ఐర్లాండ్లో తన భార్యతో కలిసి ఉండాలనుకున్నాడనీ, ఈలోగా ఈ దారుణం జరిగిందని డిక్సన్ మరో స్నేహితుడు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







