భారతదేశంతో సహా మరో నాలుగు దేశాలలో యూఏఈ మసీదుల నిర్మాణం
- August 04, 2017
యూఏఈ నేషనల్ ఆర్కైవ్స్ ఐదు మసీదులు నిర్మించడానికి మరియు యూఏఈ వెలుపల రెండు బావులను తవ్వించేందుకు సన్నాహాలు చేస్తుంది. అబూదాబి ఎమిరేట్స్ శాఖ రెడ్ క్రెసెంట్ సహకారంతో ఈ దాతృత్వ కార్యాక్రమంను ప్రారంభించింది. మౌరిటానియ, సోమాలియా, బుర్కినా ఫాసో, మాలి ,భారతదేశం లో నిర్మించబడుతున్న ఈ అయిదు మసీదులలో ఒక్కో దానిలో కనీసం 800 మంది వ్యక్తుల ఒక్కసారే నమాజు చేసుకొనే సౌకర్యంతో వీటిని నిర్మిస్తున్నారు. మసీదు భవనం ప్రాజెక్ట్ క్రింద " జాతీయ ప్రాచీన బాండాగారా మసీదులుగా " గా పిలవబడనున్నాయి. అదేవిధంగా రెండు బావులను భారతదేశం మరియు మాలిలో నిర్మించబడతాయి. నేషనల్ ఆర్కైవ్స్ ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ కు తమ సహకారంతో పాటు వారి ఉద్యోగులు ఉదారంగా అందచేయబడిన విరాళాలకు ధన్యవాదాలు తెలియజేసింది. మానవ ఔత్సాహిక మరియు స్వచ్ఛంద, సామాజిక బాధ్యతలో భాగమైన వారి దాతృత్వంతో ఇవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. నేషనల్ ఆర్కైవ్స్ ఈ రకమైన స్వచ్ఛంద మానవతావాద కార్యకలాపాలను కొనసాగించడంతో యూఏఈ ఆదర్శ చిత్రంను సూచించే ఉత్తమ మార్గంగా పరిగణించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







