పట్టణాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

- August 06, 2017 , by Maagulf
పట్టణాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

పట్టణాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. నగరాలు, పట్టణాల్లో నివాసముంటున్న వారికి కారు, ఫ్రిజ్, ఏసీ ఉన్నాయా ? అయితే సంక్షేమ పథకాలు పొందేందుకు మీరు అర్హులు కాదంటూ కేంద్రం నియమించిన దేబ్రాయ్ కమిటీ బాంబులాంటి వార్త పేల్చింది. నాలుగు గదుల ఇల్లున్నా, కారు లేదా ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ద్విచక్రవాహనం ఉంటే మీకు సర్కారు సంక్షేమ పథకాల ఫలాలు పొందటానికి అర్హులు కాదంటూ బిబేక్ దెబ్రాయ్ కమిటీ సిఫార్సు చేసింది.తాజాగా జరపనున్న సాంఘీక ఆర్థిక సర్వేలో పట్టణ వాసులకు పైన పేర్కొన్న వస్తువులు ఇంట్లో ఉంటే సంక్షేమ పథకాలు అందవని కమిటీ స్పష్టం చేసింది. ఇల్లు లేని వారు, పాలిథీన్ కవర్ల గుడిసెల్లో నివాసముండేవారు, ఎలాంటి ఆదాయం లేని, మగవారు లేని ఇళ్ల వారికి, పిల్లలు సంక్షేమ పథకాలు పొందవచ్చని కమిటీ చెప్పింది. మొత్తంమీద పట్టణాల్లో నివాసముంటున్న వారిలో 59 శాతం మంది సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com