యూఏఈ లో రెండు బాషలలో త్వరలో రసీదులు
- August 09, 2017
మీనెలవారీ సరుకుల బిల్లుల్లో మార్పును చూడడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే వారు ఇకపై ఇంగ్లీష్ బాషలోనే బిల్లులు రాయబడవు. 2018 నాటికి అన్ని దుకాణాలు మరియు రిటైలర్లు ఇంగ్లీష్ భాషతో పాటు అరబిక్ భాషని జోడించాలని ఆర్థిక వ్యవస్థ మంత్రిత్వ శాఖ ప్రకటించారు. ఆర్ధిక మంత్రిత్వశాఖలో వినియోగదారుల రక్షణ విభాగం డైరెక్టర్ హషిమ్ అల్ నౌమిమి ఈ సందర్భంగా మాట్లాడుతూ,2013 లో ఈ ప్రాజెక్టు అమలు చేయాలని సూచించినప్పటికీ అందుకు స్పందనగా కేవలం 80 శాతం సంస్థలు మాత్రమే చొరవ చూపుతున్నట్లు ఆయన అన్నారు. రెండు బాషలలో బిల్లులను సంవత్సరాంతానికి అన్ని దుకాణాలు తప్పనిసరిగా మార్పు చెందాలని ఆయన తెలిపారు. వచ్చే ఏడాదికి తప్పనిసరిగా మంత్రిత్వశాఖ రూపొందించిన నియమావళిని అనుసరించాల్సి ఉంది.వినియోగదారులు ఎవరైనా తమకు దుకాణదారులు ఇచ్చే రశీదుల్లోని భాషను అర్థం చేసుకోలేకపోయినట్లు వినియోగదారుల నుండి ఒకవేళ ఫిర్యాదులను స్వీకరించిన తరువాత మంత్రిత్వ శాఖ ఆరిపై చర్యలు అమలు చేయనుంది. షాపులు మరియు రెస్టారెంట్లు వివిధ జాతీయతల ప్రజలను నియమించదడ తో , అరబిక్ మాట్లాడే వినియోగదారులతో ఆంగ్లంలో మాట్లాడి కొందరు ఉద్యోగులచే తప్పుదారి పట్టిస్తున్నారని అది అర్థం చేసుకోవటానికి స్థానికులకు కష్టమైపోతుందని అల్ న్యూమిమి వివరించారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









