ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సెక్టార్ ఉద్యోగులకు శుభవార్త
- August 09, 2017
ఏపీ ప్రభుత్వ సెక్టార్ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. షెడ్యూల్ 9, 10 సంస్థల ఉద్యోగులకు 60 ఏళ్లకు పదవీ విరమణ అవకాశం కల్పిస్తూ సుప్రీం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్యకాలంలో 60 ఏళ్ల వయస్సు నిండి రిటైరైన ఉద్యోగులకు సర్వీసు ప్రయోజనాలను కల్పించాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. 58 ఏళ్లకే రిటైరై 60ఏళ్లు నిండని ఉద్యోగులను సర్వీసులోకి తీసుకోవాలని, సర్వీసులో ఉన్నవారిని 60 ఏళ్ల వరకు కొనసాగించాలని సుప్రీం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో 150 సంస్థల ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. తీర్పుపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









