తీవ్రవాదులు, క్రిమినల్స్ నుంచి ఉపశమనం
- August 10, 2017
అల్ అవామియా, ఈస్టర్న్ ప్రావిన్స్: సౌదీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్, తీవ్రవాదులు మరియు క్రిమినల్స్ ఏరివేత ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేశాయి. షిటీ మెజార్టీ విలేజ్లో తీవ్రవాదులు నక్కి, కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, నెలల తరబడి ఉంటోన్నవారిపై సెక్యూరిటీ ఫోర్సెస్ అద్భుతమైన పోరాట పటిమతో ఆపరేషన్ని విజయవంతం చేయడం జరిగింది. గత నాలుగు రోజులుగా జరిగిన తాజా ఆపరేషన్లో, పలువురు తీవ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మే నెలలో సాయుధ మిలిటెంట్లు 400 ఏళ్ళ చరిత్ర కలిగిన అల్ అవామియాలోని అల్ ముసావారా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు తీవ్రవాదులు. ఇలాంటి ప్రాంతంలో ఆపరేషన్ని ఛాలెంజింగ్గా తీసుకుని, తీవ్రవాదుల్ని మట్టుబెట్టామనీ, ఇకపై ఇక్కడి ప్రజలెవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భద్రతా దళాలు తెలిపాయి. ముందస్తుగా ప్రజల్ని ఖాళీ చేయించి, వారికి పునరావాసం కల్పించి, ఆ తర్వాత ఆపరేషన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









