సైబర్ సెక్యూరిటీ రంగంలో కతర్, టర్కీ పరస్పర సహకారం
- August 10, 2017
టర్కీ సైంటిఫిక్ అండ్ టెక్నలాజికల్ రీసెర్చ్ కౌన్సిల్ మరియు కతర్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ ఇరు సంస్థల మధ్య సంతకం చేసిన సైంటిఫిక్ ,టెక్నాలజీ కో-ఆపరేషన్ పై ఒప్పందం యొక్క సైబర్ సెక్యూరిటీ భాగాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించబడ్డాయని టర్కిష్ అనాడోలు ఏజెన్సీ అధ్యక్షుడు అరెఫ్ ఎర్గిన్ తెలిపారు. గత వారం టర్కీని ఒక కతర్ ప్రతినిధి బృందం సందర్శించిన మరియు అనేక సమావేశాలు నిర్వహించారు వారు శాస్త్రీయ సహకారం మరియు సాంకేతిక ఒప్పందం కింద మొదటి ప్రాజెక్టులలో సైబర్ సెక్యూరిటీ రంగంలో అమలుచేసేందుకు దృష్టి సారించినాట్లు అంగీకరించినాట్లు ఎర్గిన్ చెప్పారు. ఈ కో -ఆపరేషన్ ఒప్పందంలో, బ్యాంకులు మరియు ఇతర సంస్థలు, విద్యుత్ పంపిణీ మరియు ప్రసార మార్గాలను మరియు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ యొక్క కీలక అవస్థాపనను రక్షించడానికి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వబడుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్ (ఐగ్లౌడ్) పై డేటాను పెద్ద మొత్తంలో నిల్వ చేసే మొబైల్ పరికరాలను మరియు స్మార్ట్ అనువర్తనాలను సైబర్ దాడులకు మరియు బెదిరింపులకు వీలు లేకుండా ఒక సురక్షిత పద్ధతిలో మద్దతు ఇస్తున్న లక్ష్యాలను ప్రోత్సహిస్తుంది. టర్కీష్ మరియు కతర్ పరిశోధకులు ప్రైవేటు రంగం మరియు ప్రభుత్వ సంస్థలు మరియు రెండు దేశాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులను అమలు చేయడానికి ప్రతి కన్సార్టియంకు 2 మిలియన్లు డాలర్లను మంజూరు చేస్తుంది టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ టయిప్ ఎర్డోగాన్ డిసెంబర్ 2015 లో కతర్ ని సందర్శించిన సందర్భంగా సహకార ఒప్పందం కుదిరింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









