ఉపరాష్ట్రపతిగా మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం

- August 10, 2017 , by Maagulf
ఉపరాష్ట్రపతిగా మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం

భారత ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్‌లోని దర్బార్‌ హాల్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్రమంత్రులు, ఎన్డీయే ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తదితరులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడు విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై గెలుపొందిన సంగతి తెలిసిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com