27న బెజవాడకు అమిత్ షా
- August 12, 2017
2019 ఎన్నికల నేపథ్యంలో ఏపీలో బలోపేతమయ్యేందుకు బీజేపీ ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తరచుగా రాష్ట్రానికి వస్తూ పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఆయన బెజవాడలో మకాం వేయనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 90 రోజుల పాటు పర్యటించిన షా జూన్లో తెలుగు రాష్ట్రాల పర్యటకు వచ్చారు. తెలంగాణలో మూడు రోజులు పర్యటించినా ఏపీలో మాత్రం విజయవాడ సభకే పరిమితమయ్యారు. వార్డు కమిటీలు తొందరగా పూర్తి చేయాలని, త్వరలో మళ్లీ వస్తానని చెప్పిన ఆయన.. రాష్ట్రంలో పార్టీకి పెద్దదిక్కయిన వెంకయ్యఉప రాష్ట్రపతి అయ్యాక వస్తుండడం గమనార్హం. మూడు రోజుల పాటు విజయవాడలోనే మకాం వేసి ఒకరోజు రాష్ట్ర పార్టీ ముఖ్యులు, రాష్ట్ర మోర్చాల అధ్యక్షులతో, రెండో రోజు జిల్లాల అధ్యక్షులు, మేధావులు, పార్టీ అనుబంధ సంఘాల ముఖ్యులతో మాట్లాడతారు. మూడో రోజు బూత్ కమిటీలతో జిల్లాకు ఐదు నుంచి పది మందితో ఫోనులో మాట్లాడతారని సమాచారం.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







