ధరల మాయ: ఎంఇసి కొరడా

- August 13, 2017 , by Maagulf
ధరల మాయ: ఎంఇసి కొరడా

ఖతార్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎకనమిక్‌ అండ్‌ కామర్స్‌, జులైలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 128 ఉల్లంఘనల్ని గుర్తించి, చర్యలు చేపట్టింది.ధరల మానిప్యులేషన్‌, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన వంటివి ఈ తనిఖీల్లో అధికారులు గుర్తించారు. గుర్తించిన 128 ఉల్లంఘనలకు సంబంధించి భారీగా జరీమానాలు కూడా ఆయా సంస్థలకు విధించడం జరిగింది. అరబిక్‌లో ఇన్వాయిస్‌లు ఇవ్వకపోవడం, ప్రోడక్ట్స్‌కి సంబంధించిన డేటా, డిస్క్రిప్షన్‌ పేర్కొనకపోవడం, ప్రోడక్ట్స్‌ విక్రయం విషయంలో వినియోగదారుల్ని మోసగించడం, ప్రైస్‌ ట్యాగ్స్‌ లేకపోవడం, గడువు తీరిన ప్రోడక్ట్స్‌ని విక్రయించడం, ప్రకటించిన ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు జరపడం వంటి ఉల్లంఘనలు ఇందులో ఉన్నాయి. ఈ ఉల్లంఘనలకుగాను 5,000 ఖతారీ రియాల్స్‌ నుంచి 30,000 ఖతారీ రియాల్స్‌ వరకూ జరీమానా విధించారు. మొత్తం 1,322 ఫిర్యాదులు రాగా, వాటన్నిటినీ మినిస్ట్రీ రిజాల్వ్‌ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com