ధరల మాయ: ఎంఇసి కొరడా
- August 13, 2017
ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ ఎకనమిక్ అండ్ కామర్స్, జులైలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 128 ఉల్లంఘనల్ని గుర్తించి, చర్యలు చేపట్టింది.ధరల మానిప్యులేషన్, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన వంటివి ఈ తనిఖీల్లో అధికారులు గుర్తించారు. గుర్తించిన 128 ఉల్లంఘనలకు సంబంధించి భారీగా జరీమానాలు కూడా ఆయా సంస్థలకు విధించడం జరిగింది. అరబిక్లో ఇన్వాయిస్లు ఇవ్వకపోవడం, ప్రోడక్ట్స్కి సంబంధించిన డేటా, డిస్క్రిప్షన్ పేర్కొనకపోవడం, ప్రోడక్ట్స్ విక్రయం విషయంలో వినియోగదారుల్ని మోసగించడం, ప్రైస్ ట్యాగ్స్ లేకపోవడం, గడువు తీరిన ప్రోడక్ట్స్ని విక్రయించడం, ప్రకటించిన ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు జరపడం వంటి ఉల్లంఘనలు ఇందులో ఉన్నాయి. ఈ ఉల్లంఘనలకుగాను 5,000 ఖతారీ రియాల్స్ నుంచి 30,000 ఖతారీ రియాల్స్ వరకూ జరీమానా విధించారు. మొత్తం 1,322 ఫిర్యాదులు రాగా, వాటన్నిటినీ మినిస్ట్రీ రిజాల్వ్ చేసింది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









