ధరల మాయ: ఎంఇసి కొరడా
- August 13, 2017
ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ ఎకనమిక్ అండ్ కామర్స్, జులైలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 128 ఉల్లంఘనల్ని గుర్తించి, చర్యలు చేపట్టింది.ధరల మానిప్యులేషన్, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన వంటివి ఈ తనిఖీల్లో అధికారులు గుర్తించారు. గుర్తించిన 128 ఉల్లంఘనలకు సంబంధించి భారీగా జరీమానాలు కూడా ఆయా సంస్థలకు విధించడం జరిగింది. అరబిక్లో ఇన్వాయిస్లు ఇవ్వకపోవడం, ప్రోడక్ట్స్కి సంబంధించిన డేటా, డిస్క్రిప్షన్ పేర్కొనకపోవడం, ప్రోడక్ట్స్ విక్రయం విషయంలో వినియోగదారుల్ని మోసగించడం, ప్రైస్ ట్యాగ్స్ లేకపోవడం, గడువు తీరిన ప్రోడక్ట్స్ని విక్రయించడం, ప్రకటించిన ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు జరపడం వంటి ఉల్లంఘనలు ఇందులో ఉన్నాయి. ఈ ఉల్లంఘనలకుగాను 5,000 ఖతారీ రియాల్స్ నుంచి 30,000 ఖతారీ రియాల్స్ వరకూ జరీమానా విధించారు. మొత్తం 1,322 ఫిర్యాదులు రాగా, వాటన్నిటినీ మినిస్ట్రీ రిజాల్వ్ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







