వలసదారుల్ని దోచుకుంటున్న ముఠా అరెస్ట్‌

- August 13, 2017 , by Maagulf
వలసదారుల్ని దోచుకుంటున్న ముఠా అరెస్ట్‌

ఫుర్వానియా డిటెక్టివ్స్‌, ఓ దోపిడీ దొంగల ముఠాని అరెస్ట్‌ చేసింది. ఇందులో ముగ్గురు బెడౌన్‌ రెసిడెంట్స్‌ కాగా, మరొకరు భారతదేశానికి చెందిన వ్యక్తి. వలసదారుల్ని పదునైన ఆయుధాలతో బెదిరించి, దోచుకోవడం ఈ ముఠా ప్రత్యేకత. ఈ క్రమంలో ఓ వ్యక్తిని ఈ ముఠా హత్య చేసింది కూడా. ముఠా మొత్తానికి భారతీయుడొకరు నాయకత్వం వహిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కువగా వీరు జలెబ్‌ అల్‌ షుయోక్‌ ప్రాంతంలోనే నేరాలకు పాల్పడినట్లు అధికారులు ధృవీకరించారు. నలుగురు సభ్యుల ముఠాని, అవసరమైన కఠిన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com